Spotless: మచ్చలేని మోము చూడటానికి అందంగా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరి ముఖం అలా కనిపించాలని అందరూ అనుకుంటారు. కానీ మొటిమలు వాటి తాలూకు మచ్చలు కారణంగా మోము అందవిహీనంగా కనిపిస్తుంది.. మచ్చలు పోయి మీ ముఖం ప్రకాశవంతంగా కనిపించాలంటే సముద్రపు ఉప్పు సరి అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. సముద్రపు ఉప్పు మచ్చలను పోగొట్టడానికి అద్భుతంగా పనిచేస్తుంది.. అదెలాగో ఇప్పుడు చూద్దాం..
మూడు చెంచాల నిమ్మరసంలో మూడు చెంచాల సముద్ర ఉప్పును కలిపి ముఖానికి రాసుకోవలి. 5 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే ముఖం కాంతివంతంగా ఉండటమే కాకుండా మంచి రంగు కూడా వస్తుంది. నాలుగు చెంచాల ఆలివ్ ఆయిల్ లో మూడు చెంచాల సముద్ర ఉప్పు, ఒక చెంచా ఓట్ మీల్ కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 5 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కోవాలి..
నాలుగు స్పూన్ల కొబ్బరినూనెలో రెండు స్పూన్ల సముద్ర ఉప్పును కలిపి స్క్రబ్ గా తయారు చేసుకోవాలి.ఈ స్క్రబ్ ని ముఖానికి రాసి 5 నిమిషాల పాటు మసాజ్ చేసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే చర్మంలో మలినాలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా ఉంటుంది. ఈ విధంగా నెలలో రెండు సార్లు చేస్తూ ఉంటే చర్మం తేమగా ఉంటుంది. మచ్చలు పోతాయి. మోము ప్రకాశవంతంగా కనిపిస్తుంది.