Corona: 2019 నవంబర్ నెలలో చైనాలో బయటపడ్డ కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. పేదవాడు మొదలుకొని సెలబ్రిటీ వరకు ప్రతి ఒక్కరిని కరోనా టచ్ చేసుకుంటూ వెళ్ళింది. ఈ మహమ్మారి కారణంగా చాలామంది మరణించారు. ఈ వైరస్ ని అరికట్టడానికి ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను చిన్నభిన్నం చేసింది. ఇదిలా ఉంటే ఈ వైరస్ ప్రభావం గత కొద్ది నెలల నుండి తగ్గిన సంగతి తెలిసిందే. అయితే కరోనా తగ్గిన తర్వాత ఊహించని రీతిలో మరణాలు సంభవిస్తున్నాయి. చాలాఆరోగ్యకరమైన బలమైన మనుషులు కూడా నిమిషాలలో చనిపోతున్నారు.
మరి ముఖ్యంగా జిమ్ చేసేవాళ్లు ప్రాణాలు విడవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్… ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి లాంటి ఫిట్నెస్ కలిగిన మనుషులు కూడా గుండెపోటుతో మరణించడం జరిగింది. వీలు మాత్రమే కాదు చాలామంది జిమ్ చేసేవాళ్ళు మరణిస్తూ ఉన్నారు. ఇటువంటి తరుణంలో వైద్యులు ఇటీవల ఓ సంచలన ప్రకటన చేయడం జరిగింది. కరోనా సోకిన తరువాత జిమ్ చేసేవాళ్లు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరోనా సోకిన తర్వాత వెంటనే ఒకేసారి కఠినమైన వ్యాయామం చేయకుండా మళ్లీ మొదటి నుండి స్టార్ట్ చేయాలని అన్నారు.
ఈ రీతిగా స్టార్ట్ చేసి క్రమేపీ పెంచుకుంటూ పోవాలని తెలిపారు. కరోనా బారిన పడక ముందు చేసిన కఠినమైన వ్యాయామాలు… కరోనా శరీరానికి ఎటాక్ అయిన తరువాత వెంటనే చేయకూడదని పేర్కొన్నారు. కరోనా నుంచి కోలుకున్నాక తరచూ ఆయాసం, తలనొప్పి, నిద్రలేమి వంటి సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలికంగా వైరస్ బారిన పడిన వాళ్ళు వ్యాయామాలకు దూరంగా ఉంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.