Supreme Court: ఏపి సర్కార్ కు సుప్రీం కోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ మాజీ మంత్రి నారాయణ కు హైకోర్టు మంజూరు చేసిన ముందుస్తు బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ ఏపి సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టేసింది. నారాయణ ముందస్తు బెయిల్ ను రద్దు చేసేందుకు సుప్రీం కోర్టు నిరాకరిస్తూనే కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రతి చిన్న విషయానికి సుప్రీం కోర్టు తలుపు తడితే ఎలా అంటూ సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మీ రాజకీయ ప్రతీకారంలో తమను భాగస్వాములను చేయొద్దని కూడా ఏపి ప్రభుత్వంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
ఏపి రాజధాని అమరావతి పరిధిలో నిర్మించలపెట్టిన ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ ను మంత్రి హోదాలో నారాయణ ఉద్దేశపూర్వకంగా మార్చారని, తన వారికి మేలు చేసేందుకే ఆయన ఈ పని చేశారంటూ ఏపి సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో సీఐడీ అధికారులు చర్యలు మొదలు పెట్టకముందే నారాయణ ఏపీ హైకోర్టు ను ఆశ్రయించారు. వైద్య చికిత్స ల కోసం విదేశాలకు వెళ్లాల్సి ఉందని, ఈ క్రమంలో అమరావతి కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆయన హైకోర్టును కోరారు. దీనిపై కోర్టు సానుకూలంగా స్పందించి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
అయితే నారాయణ కు హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో ఏపి సర్కార్ ఇటీవల పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై సోమవారం విచారణ జరిగింది. విచారణ సందర్భంగా ఏపి సర్కార్ వాదనలపై సుప్రీం కోర్టు తిరస్కరించింది. నారాయణ కు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ ను రద్దు చేయడానికి అంగీకరించలేదు. ఏపి సర్కార్ పిటిషన్ ను తోసిపుచ్చింది.
Bypoll Results: ఆ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ‘నోటా’నే సెకండ్ ప్లేస్ .. ఎక్కడంటే..?