మొక్కజొన్న: మొక్కజొన్న గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు.మన భారతీయులు ఎక్కువగా మొక్కజొన్నను పండిస్తారు.అలాగే ప్రతి ఒక్కరు మొక్కజొన్న కండిని తినడానికి ఇష్టపడతారు.వీటి ధర కూడా తక్కువగానే ఉంటుంది. మొక్కజొన్నలో చాలా రకాల పోషకాలు ఉంటాయి.వర్షా కాలంలో మొక్కజొన్న లను కాల్చుకొని తింటే భలే ఉంటుంది.అలాగే వీటిని కొందరు ఉడికించుకోని కూడా తింటూ ఉంటారు. మొక్కజొన్నల నుండి పాప్ కార్న్, కార్న్ ఫ్లెక్స్,లాంటివి తయారు చేస్తారు. అలాగే లేతగా ఉన్న కంకులు, బేబీ కార్న్స్ తో వంటలు కూడా చేస్తారు. మొక్కజొన్న పిండిని అయితే వివద రకాల ఫ్రై ఐటమ్స్ లో విరివిగా ఉపయోగిస్తుంటారు. అయితే మొక్కజొన్న కండిని తినాలంటే ముందుగా దాని మీద ఉన్న తొక్క,పీచు కూడా తీసేస్తాము.కానీ మనం పనికిరాదు అని బయట పడేసే మొక్కజొన్న పీచు వలన ఎన్నో లాభాలు ఉన్నాయి. అవేంటో మీరు తెలుసుకుంటే ఇకనుంచి మొక్క జొన్న పీచును పడేయకుండా తింటారు.
మొక్కజొన్న పీచు వలన కలిగే ఆరోగ్యప్రయోజనాలు :
మొక్కజొన్న పీచులో పొటాషియం, క్యాల్షియం, విటమిన్ బి, సి మరియు విటమిన్ కే వంటి విలువైన పోషకాలు ఉంటాయి. అలాగే మొక్కజొన్న పీచుతో టీ తయారు చేసుకొని తాగడం వలన అందులో ఉన్న ప్లేవనాయిడ్స్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరానికి బాగా అందుతాయి. అలాగే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.మొక్కజొన్నలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు యూరిన్ ఇన్ఫెక్షన్ ను తగ్గిస్థాయి.
కిడ్నీలో రాళ్లను నివారించడంలో :
మొక్కజొన్న పీచు తినడం వలన శరీరంలో ఉన్న అదనపు నీరు, వ్యర్ధాలు బయటకు పోతాయి. అలాగే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా ఈ మొక్క జొన్న పీచు బాగా సహాయపడుతుంది. అలాగే మొక్కజొన్న పీచు బ్లడ్ లోని కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుతుంది. కాబట్టి రక్తపోటు సమస్యతో బాధపడేవారు మొక్కజొన్న పీచుతో టీ చేసుకుని త్రాగితే రక్తపోటు అదుపులో ఉంటుంది.
బరువు తగ్గడంలో మొక్కజొన్న పీచు పాత్ర :
అధిక బరువుతో ఇబ్బంది పడేవారు మొక్కజొన్న పీచుతో తయారుచేసిన టీ ను రోజుకు రెండు సార్లు తాగితే బరువు తగ్గడం సులభతరం అవుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మనకు ఏదైన గాయం తగిలితే రక్తం గడ్డ కట్టడానికి ఉపయోగపడే K విటమిన్ ఈ మొక్కజొన్న పీచులో అధికంగా ఉంటుంది.
మొక్కజొన్న పీచు టీ ఎలా తయారుచేయాలంటే..?
ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుని అందులో కొద్దిగా నీళ్లు పోసి కొన్ని మొక్కజొన్న పీచు లను వేసి ఆ నీటిని బాగా మరిగించుకోవాలి. నీళ్లు బాగా మరిగిన తరువాత మరిగించిన నీళ్లను మరొక గ్లాసులోకి వడకట్టుకోవాలి. కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ నీళ్లలో కొద్దిగా నిమ్మరసం వేసి బాగా కలిపి త్రాగాలి. ఈ మొక్కజొన్న పీచు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే గాలి దూరని డబ్బాలో వేసి గట్టిగా మూత పెట్టి ఫ్రిజ్ లో పెట్టాలి.