IND Vs END 2 nd Test: ఇంగ్లాండ్ తో జరిగిన రెండో టెస్ట్ లో భారత్ అధ్బుత విజయం సాధించింది. డ్రా దిశగా సాగుతున్న మ్యాచ్ ను బౌలర్లు ఒక్క సారిగా విజయ తీరాలకు చేర్చారు. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ ను 120 పరుగులకే పరిమితం చేసి సిరీస్ తొల విజయాన్ని అందించారు. దీంతో అయిదు టెస్ట్ సిరీస్ లో భారత్ 1-0 ఆధిక్యం సాధంచింది. రెండ ఇన్గ్స్ లో భారత్ నిర్ధేశించిన 272 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాడ్ బ్యాట్స్ మెన్ పని పట్టారు.
తొలి ఓవర్ నుండి వికెట్లు తీసి ఇంగ్లాండ్ పై ఒత్తిడి పెంచారు. చివర్లో బట్లర్ (25), రాబిన్ సన్ (9), గంట పాటు పోరాడి మ్యాచ్ ను డ్రా చేసేలా కనిపించారు. అయితే బుమ్రా, సిరాజ్ చివరలోవారిద్దరినీ ఔట్ చేయడంతో భారత్ 151 పరుగులు తేడాతో విజయం సాధించింది.
టీమ్ ఇండియా జట్టు విజయంతో సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. భారత జట్టు మ్యాచ్ గెలిచిన వెంటనే తెలంగాణ మంత్రి కేటిఆర్ భారత జట్టుకు అభినందనలు తెలియజేశారు. ఉత్కంఠ పోరులో భారత్ అధ్భుత విజయం సాధించిందని కేటిఆర్ కొనియాడారు.