Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి అమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత నివాసంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహిస్తొంది. మనీలాండరింగ్ కేసుతో సంబంధం ఉందన్న అనుమానంతో ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ ఇంట్లో తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తొంది. సీఆర్పీఎఫ్ సిబ్బంది భద్రత నడుమ సంజయ్ సింగ్ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుతో సంబంధం ఉన్న వ్యాపార వేత్త దినేశ్ అరోరాతో సంజయ్ కి పరిచయాలు ఉన్నట్లు ఈడీ గుర్తించింది. ఎంపీ సంజయ్ సింగ్ చుట్టూ ఈడీ ఉచ్చు బిగించిందని అంటున్నారు.
ఈ కేసులో అప్రూవర్లుగా మారిన ముగ్గురు నిందితులు కీలక విషయాలు వెల్లడించినట్లుగా తెలుస్తొంది. అప్రూవర్ లుగా మారిన వారిలో శరత్ చంద్రారెడ్డి, దినేశ్ అరోరా, మాగుంట రాఘవ ఉన్నారు. ఈ కేసులో ఆప్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను సీబీఐ ఈ ఏడాది ఫిబ్రవరిలో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దీంతో అప్పటి డి ఈ కేసు దేశ వ్యాప్తంగా సంచనంగా మారింది. ఇదే కేసులో ఏప్రిల్ లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను కూడా దాదాపు తొమ్మిది గంటల పాటు దర్యాప్తు అధికారులు ప్రశ్నించారు. తాజాగా ఈ కేసులో బుధవారం తెల్లవారుజాము నుండి ఎంపీ సంజయ్ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు చేపట్టడం హాట్ టాపిక్ అయ్యింది.