కర్ణాటక లో ముఖ్యమంత్రి సిద్దారామయ్య సర్కార్ ఉచిత రేషన్ బియ్యం పంపిణీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన ఐదు ప్రధాన హామీల్లో ఒకటైన అన్నభాగ్య పథకం అమలునకు ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అన్నభాగ్య పథకాన్ని జులై ఒకటవ తేదీ నుండి అమల్లోకి తీసుకురావాల్సి ఉండగా.. అందుకు అవసరమైన బియ్యం సేకరణ సాధ్యం కావడం లేదు.
దీంతో సిద్ధరామయ్య సర్కారు నూతన నిర్ణయాన్ని తీసుకుంది. ఉచిత బియ్యానికి బదులుగా నగదు ఇస్తామని ప్రకటించింది. కిలో బియ్యానికి రూ.34 చొప్పున ఐదు కిలోల బియ్యానికి సమానమైన డబ్బును బీపీఎల్ కార్డుదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్టు తెలిపింది. ఈ మేరకు సీఎం సిద్దారామయ్య అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నది.
గన్ మిస్ ఫైర్ .. హెడ్ కానిస్టేబుల్ మృతి