Oscar Award’s: గత ఏడాది విడుదలైన “RRR” భారతీయ చలనచిత్ర రంగంలో అనేక రికార్డులు క్రియేట్ చేయడం తెలిసిందే. అంతే కాదు ప్రపంచ స్థాయిలో ఈ సినిమా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ స్థాయి పెంచడం జరిగింది. ప్రపంచ సినిమా రంగంలో అత్యంత గౌరవప్రదమైన పురస్కారం ఆస్కార్ అవార్డు కూడ గెలుచుకోవడం జరిగింది. ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవానికి లిరిక్స్ రాసిన చంద్రబోస్ కి ఆస్కార్ అవార్డ్ రావడం జరిగింది. ఇదిలా ఉంటే ఇప్పుడు వచ్చే ఏడాది మార్చిలో జరగబోయే 96వ ఆస్కార్ అవార్డుల వేడుకలకు సంబంధించి అప్పుడే ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగా 398 మంది కొత్త మెంబర్స్ ను జ్యూరీ లోకి అకాడమీ తీసుకోనుంది.
దీంతో “RRR” సినిమా యూనిట్ నుంచి ఎన్టీఆర్, చరణ్, ఎంఎం కీరవాణి, చంద్రబోస్, సెంథిల్, సాబు సిరిల్ లను జ్యూరీ లోకి అకాడమీ ఆహ్వానించడం జరిగింది. నిర్మాత క్యాటగిరి నుంచి బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ కి కూడా స్థానం లభించింది. ఎన్టీఆర్ మరియు రాంచరణ్ లకు ఆస్కార్ జ్యూరీ మెంబర్లుగా స్థానం లభించటంతో అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. “RRR” సినిమా ఎంత హిట్ అయిందో అదే రీతిలో తారక్ మరియు చరణ్ కి ప్రపంచ స్థాయిలో మంచి పేరు తీసుకురావడం జరిగింది. ఒకానొక దశలో గత ఏడాది జరిగిన ఆస్కార్ రేసులో బెస్ట్ నటుడులో ఎన్టీఆర్ పేరు కూడా వినపడింది.
కానీ చివరి నిమిషంలో… ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో “RRR” కి ఆస్కార్ అవార్డు లభించింది. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక సినిమా అవార్డు “RRR” గెలుచుకోవటం తో దేశ ప్రధానితో పాటు వివిధ రాష్ట్రాలను మంత్రులు ముఖ్యమంత్రులు సినిమా ఇండస్ట్రీకి చెందిన దిగ్గజాలు ఎంతోమంది అభినందించారు. అయితే ఇప్పుడు అదే ఆస్కార్ అవార్డు అకాడమీకి జ్యూరీ మెంబర్లుగా ఎన్నిక కావడంతో చాలా మంది ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. తెలుగు సినిమా స్థాయి ప్రపంచ స్థాయికి ఎదిగింది అని అంటున్నారు.