Mamata Benerjee: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ ఆహ్వానించింది. తమ యూనివర్శిటీలో వచ్చే ఏడాది జూన్ లో జరిగే కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించాల్సిందిగా ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ ప్రొ – వైస్ ఛాన్సలర్ జోనాథన్ మిచీ ఆహ్వానించారు. బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ లో మిచీ ఈ విషయాన్ని ప్రకటించారు. తమ అహ్వానానికి సీఎం అంగీకరించారని ఆయన తెలిపారు.
బెంగాల్ బిజినెస్ సమ్మిట్ లో సీఎం ప్రధాన సలహాదారు అమిత్ మిశ్రా .. మిచీని వేదికపై అహ్వానించగా ఆయన మాట్లాడారు. సీఎం మమతా బెనర్జీ నిర్వహించిన పోరాటాలు, విజయాల గురించి తమ యూనివర్శిటీలో ఉపన్యాసం ఇవ్వడానికి అహ్వానించామని మిచీ తెలిపారు. తమ విశ్వవిద్యాలయంలో ఎక్కువ మంది భారతీయులు ఉన్నారని చెప్పారు. సీఎం సందేశాన్ని తమ విద్యార్ధులు మరియు అధ్యాపకులు బాగా స్వీకరిస్తారని అన్నారు. అక్స్ ఫర్డ్ యూనివర్శిటీ పూర్వ విద్యార్ధి అయిన లక్ష్మీ గ్రూప్ ఎండీ, పారిశ్రామికవేత్త రుద్ర చటర్జీ తనను సీఎంకి పరిచయం చేశారని మిచీ తెలిపారు.
అంతకు ముందు సీఎం మమతా బెనర్జీ తన చిన్నతనంలో తండ్రి మరణించిన తర్వాత చదువు కోసం పడిన ఇబ్బందులు, పోరాటాల గురించి మాట్లాడారు. ఇక్కడ పాల్గొన్న చాలా మంది మాదిరిగా తనకు ఇంగ్లీష్ లో మాట్లాడటం లాదని కానీ చాలా బాషలు తెలుసునని అన్నారు. రెండేళ్ల క్రితం కూడా మమతా బెనర్జీ ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీలో ప్రసంగానికి ఆహ్వానం అందింది. అయితే నాడు వర్చువల్ పద్దతిలో కార్యక్రమాన్ని ఉద్దేశించి మమతా బెనర్జీ ప్రసంగించాల్సి ఉండగా, చివరి నిమిషంలో రద్దు అయ్యింది. దానిపై నాడు టీఎంసీ అక్షేపణ కూడా వ్యక్తం చేసింది. తాజాగా ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ మరో సారి మమతా బెనర్జీని ఆహ్వానించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
Millets: పోషకాహార ప్రియులకు గుడ్ న్యూస్ .. ఇక బియ్యం ఆకారంలో మిల్లెట్లు