Bombay High Court: న్యాయస్థానాలు సుదీర్ఘకాలం సెలవులు తీసుకోవడం వల్ల కక్షిదారుల ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతున్నట్లు ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) ఆరోపించింది. బొంబాయి హైకోర్టు ధర్మసనం ఈ పిల్ విచారణకు స్వీకరించడం జరిగింది. సబీన లక్డావాలా దాఖలు చేసిన ఈ పిటిషన్ దీపావళి పండుగ అనంతరం విచారణ చేస్తామని బాంబే హైకోర్టు తెలియజేయడం జరిగింది. దీంతో కోర్టులు ఎక్కువ కాలం పాటు సెలవులు తీసుకోవడం వల్ల వ్యాజ్యాల దాఖలు, వాటి విచారణ ప్రభావితం చెందే అవకాశం ఉందని పిటీషనర్ ఆరోపించారు.
న్యాయస్థానంలో న్యాయాన్ని కోరే హక్కు కక్షిదారులకు ప్రాథమిక హక్కులు అని అన్నారు. ఈ క్రమంలో న్యాయస్థానాలు సుదీర్ఘకాలం సెలవులు తీసుకోవడం… హక్కులను కాలరాయడమే అని పిటీషనర్ ఆరోపించారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన పిటిషనర్ తరుపు న్యాయవాది మ్యాథ్యూస్ నేడుంపర వాదిస్తూ… కోర్టులో న్యాయవాదులు సెలవులు తీసుకోవడం పట్ల పిటిషనర్ కి అభ్యంతరం ఏమీ లేదని అన్నారు. కానీ న్యాయ వ్యవస్థలో ఉండే కీలక సభ్యులు అదే సమయంలో సెలవులు తీసుకోకూడదని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాదు సంవత్సరం పొడవునా న్యాయస్థానాలు పనిచేసే విధంగా కోరుతున్నారని పేర్కొన్నారు. ఇదీలా ఉంటే ముంబై హైకోర్టులో అక్టోబర్ 22 నుంచి నవంబర్ 9 వరకు దీపావళి సెలవులు. దీంతో ఈ పిల్ పై నవంబర్ 15వ తారీకు విచారణ జరుపుతామని జస్టిస్ ఎన్వి గంగాపూర్ వాలా, జస్టిస్ ఆర్ ఎన్ లడ్డా డివిజన్ బెంచ్ తెలియజేసింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?