Sonia Gandhi: నూతన పార్లమెంట్ భవన్ లో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై వాడీవేడి చర్చ జరుగుతోంది. బిల్లుపై చర్చలో భాగంగా కాంగ్రెస్ తరపున సోనియా గాంధీ చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. ఇది నా జీవితంలో కూడా ఎమోషనల్ మూమెంట్. వంటింటి నుండి ప్రపంచ వేదికల వరకూ భారత మహిళల పాత్ర ఎంతో ఉందన్నారు.
మహిళలు వారి స్వార్ధం గురించి ఏనాడు ఆలోచించరు అని అన్నారు సోనియా గాంధీ. స్త్రీల త్యాగాలు ఎనలేనివి అని కొనియాడారు. ఆధునిక భారత నిర్మాణంలో పురుషులతో కలిసి స్త్రీలు పోరాడారన్నారు. సరోజినీ నాయుడు, సుచేత కృపాలనీ, ఆరుణాసఫ్ ఆలీ, విజయలక్ష్మీ పండిట్ వంటి వారెందరో దేశం కోసం పోరాడారని గుర్తు చేశారు. ఈ బిల్లు కోసం దశాబ్దాలుగా పోరాడుతున్నామన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు రాజీవ్ గాంధీ కల అని, స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళా ప్రాతినిధ్యాన్ని నిర్ణయించేందుకు తొలి సారిగా రాజ్యాంగ సవరణ చేస్తూ రాజీవ్ గాంధీ బిల్లును తీసుకొచ్చారని చెప్పారు. రాజ్యసభలో ఏడు ఓట్ల తేడాతో ఓడిపోయిందని గుర్తు చేశారు సోనియా గాంధీ.
ఆ తర్వాత పీఎం పీవీ నర్శింహరావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యసభలో ఆమోదించిందన్నారు. ఫలితంగా స్థానిక సంస్థల ద్వారా దేశ వ్యాప్తంగా 15 లక్షల మంది మహిళా నేతలు ఎన్నికయ్యారన్నారు. దీంతో, రాజీవ్ గాంధీ కల పాక్షికంగా మాత్రమే పూర్తయిందన్నారు. ఈ బిల్లు ఆమోదంతో అది పూర్తి అవుతుందని చెప్పారు. గతంలో బీజేపీ సభ్యులు మహిళా బిల్లును అడ్డుకున్నయనీ, కానీ ఇప్పుడు ఈ బిల్లును కాంగ్రెస్ పార్టీ సమర్ధిస్తుందని ప్రకటించారు సోనియా గాంధీ. కానీ బీజేపీ తెస్తున్న బిల్లులో కొన్ని భయాలు ఉన్నాయన్నారు. ఇప్పటి వరకూ 13 ఏళ్లుగా మహిళలు బిల్లు అమలు కసం వేచి చూస్తున్నారన్నారు. ఇంకా ఎన్నాళ్లు మహిళలు వేచి చూడాలన్నారు. వెంటనే కుల గణన చేసి మహిళలకు రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేష్ల పై కూడా నిర్ణయం తీసుకోవాలని సోనియా గాంధీ డిమాండ్ చేశారు.
కాగా సోనియా గాంధీ వ్యాఖ్యలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఖండించారు. కాంగ్రెస్ నిర్ణయాలను తప్పుబడుతూ బీజేపీ ఎంపీలు నినాదాలు చేశారు. డీఎంకే ఎంపీ కనిమొలి మాట్లాడుతూ .. మహిళా బిల్లును బీజేపీ రాజకీయంగా వాడుకుంటోందని అన్నారు. దేశంలోనే తొలి సారిగా 1921లో తమిళనాడు మహిళా ప్రజా ప్రతినిధిగా ఎన్నుకున్నామన్నారు. వందేళ్ల తర్వాత ఇప్పటికీ మహిళలకు రిజర్వేషన్లు అమలు కాలేదన్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో రాజ్యసభలో మహిళా బిల్లును ఆమోదించారని అన్నారు.
Tirumala: తిరుమల కాలిబాట మార్గంలో చిక్కిన మరో చిరుత.. టీటీడీ చైర్మన్ భూమన ఎమన్నారంటే..?