Jayaprada: సినీనటి, మాజీ ఎంపీ జయప్రదకు సుప్రీం కోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. చెన్నైలోని జయప్రద సినిమా థియేటర్ కు సంబంధించిన ఈఎస్ఐ కేసులో ట్రయిల్ కోర్టు విధించిన ఆరు నెలల జైలు శిక్షపై సుప్రీం కోర్టు స్టే విధించింది. దీంతో ఆమెకు ఉపశమనం లభించింది. ఈ మేరకు జయప్రద దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన అనంతరం సుప్రీం కోర్టు సోమవారం ఈ మేరకు అదేశాలు జారీ చేసింది. జయప్రద పిటిషన్ పై హైకోర్టులో విచారణ ముగిసేంత వరకూ జైలు శిక్షపై స్టే విధిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
వివరాల్లోకి వెళితే.. సినీనటి జయప్రదకు చెన్నై ఎగ్మోర్ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. లేబర్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన అనంతరం ఎగ్మోర్ కోర్టు గతంలో ఈ తీర్పు ఇచ్చింది. జయప్రదతో పాటు మరో ఇద్దరికి కోర్టు జైలు శిక్ష, రూ.5వేల జరిమానా విధించింది. చెన్నైలోని రాయపేటలో జయప్రదకు ఓ సినిమా ధియేటర్ ఉంది. చెన్నైకి చెందిన రామ్ కుమార్, రాజబాబు తో కలిసి అన్నా రోడ్డులో సినిమా ధియేటర్ ను నడిపించారు.
సినిమా థియేటర్ లో పని చేస్తున్న కార్మికుల నుండి వసూలు చేసిన ఈఎస్ఐ మొత్తాన్ని చెల్లించకపోవడంతో కార్మికులు ఎగ్మోర్ కోర్టును ఆశ్రయించారు. వాళ్లకు రావాల్సిన మొత్తాన్ని ఇస్తానని, ఈ పిటిషన్ ను కొట్టివేయాలని జయప్రద కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా అందుకు ట్రైల్ కోర్టు ఒప్పుకోలేదు. కార్మికులకు అందాల్సిన మొత్తాన్ని చెల్లిస్తానని జయప్రద కోర్టుకు తెలుపగా, అందుకు లేబర్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ న్యాయవాది అభ్యంతరం తెలిపారు.
ఇరుపక్షాల వాదనలు విన్న ట్రయల్ కోర్టు .. జయప్రద సహా ముగ్గురికి ఆరు నెలల జైలు శిక్ష, ఆయిదు వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై జయప్రద చెన్నై హైకోర్టును ఆశ్రయించారు. అయితే ట్రయల్ కోర్టు తీర్పును హైకోర్టు సమర్ధించింది. స్టే విధించడానికి హైకోర్టు నిరకరించింది. దీంతో జయప్రద సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
Ambati Rambabu Vs Ayyanna patrudu: పవన్ నివాసానికి చంద్రబాబు .. అంబటి వర్సెస్ అయ్యన్న వంగ్యాస్త్రాలు