Samantha: స్టార్ హీరోయిన్ సమంత జీవితం ఒడిదుడుకుల మధ్య సాగుతోంది. గత రెండు సంవత్సరాల నుండి వ్యక్తిగతంగా మరియు ప్రొఫెషనల్ గా చాలా సమస్యలు ఎదుర్కోవడం జరిగింది. 2017లో నాగచైతన్యనీ ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత నాలుగు సంవత్సరాలకు 2021లో విడాకులు ఇచ్చి విడిపోవడం జరిగింది. ఆ తర్వాత 2022వ సంవత్సరంలో మయో సైటీస్ అనే ప్రాణాంతకర వ్యాధి బారిన పడటం జరిగింది. దీంతో దాదాపు ఆరు నెలల పాటు సినిమా షూటింగులకు దూరంగా ఉండి.. పూర్తిగా మంచానికి పరిమితం అయింది. దానికి ముందే ఆమె నటించిన యశోద, శకుంతలం సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి.
ఈ రకమైన పరిస్థితులలో ఉన్న సమంత.. ఈ ఏడాది మార్చి నెలలో కోలుకుని షూటింగులు స్టార్ట్ చేయడం జరిగింది. విజయ్ దేవరకొండతో “ఖుషి” సినిమా చేసి.. సెప్టెంబర్ నెలలో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. “ఖుషి” సినిమా హిట్ అయిన తర్వాత.. విశ్రాంతి కోసం విదేశాలకు వెళ్లిపోవడం జరిగింది. అక్కడే దాదాపు రెండు నెలలకు పైగా వివిధ దేశాలు తిరుగుతూ.. మయో సైటీస్ కి సంబంధించి పలు చికిత్సలు చేయించుకుని పూర్తిగా రికవరీ అయ్యి ఇటీవల ఇండియాలో అడుగు పెట్టింది. ఆ తర్వాత నిర్మాణ సంస్థ ప్రారంభించినట్లు తెలియజేయడం జరిగింది. కొత్త టాలెంట్ ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రకటన కూడా చేయడం జరిగింది.
ఇదిలా ఉంటే ఇటీవల సోషల్ మీడియాలో ఫాలోవర్స్ లో ఒకరు.. రెండో పెళ్లి గురించి ప్రశ్నించారు. రెండో పెళ్లి ఎందుకు చేసుకోవాలనుకోవడం లేదంటూ.. ఓ నెటిజన్ సమంతని అడగడం జరిగింది. దీనికి సమంత ఇండియాలో మొదటి పెళ్లి కంటే రెండు మూడో పెళ్లిళ్ల విడాకుల రేటు ఎక్కువగా ఉంటుందని లెక్కలు బయటపెట్టింది. ఇది అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అంశం కాదని.. స్పష్టం చేసింది. ఇదే సమయంలో దేశంలో విడాకుల గణాంకాలను కూడా ఆమె పోస్ట్ చేయడం జరిగింది.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!