Ambati Rambabu Vs Ayyanna patrudu: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివాసానికి టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్లి భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆదివారం రాత్రి మాదాపూర్ లోని పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లిన చంద్రబాబు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఏపీలో తాజా రాజకీయ పరిణామాలు, పొత్తు పటిష్టత, సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిపెస్టో తదితర అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తొంది.
అయితే పవన్ కళ్యాణ్ నివాసానికి చంద్రబాబు వెళ్లి భేటీ కావడంపై వైసీపీ నేత, ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్ (ఎక్స్) వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో ఇల్లు లేని వారు ఎవరి ఇంటికి ఎవరు వెళ్లిన చివరకు అక్కడే స్థిరపడతారు అంటూ కామెంట్స్ చేశారు. అలానే నాదెండ్ల సంతృప్తి చెందేలా చర్చలు జరిగాయి, అర్ధమయ్యిందా.. నాదెండ్ల విముక్త జనసేన కోసం పారాడేవాడే అసలైన సైనికుడు అని ట్వీట్ చేశారు.
చంద్రబాబు, నాదెండ్ల మనోహర్ ఒకే సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో నాదెండ్లను టార్గెట్ చేస్తూ అంబటి రాంబాబు విమర్శలు చేశారు. అయితే దీనిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు సైతం ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ అంబటి పై సెటైర్ వేశారు. సీట్ పోయింది.. ట్వీట్ మిగిలింది.. అయ్యోయ్యే అంబటీ.. అంటూ సెటైర్ వేశారు. రాబోయే ఎన్నికల్లో అంబటి స్థానంలో మరో నేతకు సత్తెనపల్లి నుండి వైసీపీ దింపే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అంబటికి సీటు పోయింది అన్నట్లుగా అయ్యన్న కామెంట్స్ చేశారు.
రాబోయే ఎన్నికల్లో టీడీపీ – జనసేన పొత్తుతో పోటీ చేయనున్న నేపథ్యంలో వైసీపీ గెలుపే లక్ష్యంగా ఇన్ చార్జిల మార్పులు చేర్పులు చేస్తొంది. ఈ క్రమంలో పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు స్థాన చలనం, పక్కన పెట్టడం లాంటి కీలక నిర్ణయాలను తీసుకుంటోంది వైసీపీ. ఈ నేపథ్యంలో ఎవరిని పక్కన పెడతారో అన్న ఆందోళన పలువురు వైసీపీ ఎమ్మెల్యేల్లో నెలకొంది.
Joe Biden: అమెరికాలో కలకలం .. అధ్యక్షుడు బైడెన్ సెక్యురిటీ వాహనాన్ని ఢీకొట్టిన కారు