Bigg Boss 7 Telugu: తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఆదివారంతో ముగిసింది. గ్రాండ్ ఫినాలే అంగరంగ వైభవంగా జరిగింది. బిగ్ బాస్ సీజన్ సెవెన్ టైటిల్ విన్నర్.. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ గెలవడం జరిగింది. రన్నరప్ గా అమర్ దీప్ నిలిచాడు. అయితే ఆదివారం టైటిల్ విన్నర్ ప్రకటించాక బయటకు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ వస్తున్న సమయంలో.. దాడులు జరిగాయి. అమర్ దీప్, అశ్విని సీజన్ సిక్స్.. కంటెస్టెంట్ గీతు రాయల్ వాహనాల.. అద్దాలను పగలగొట్టడం జరిగింది. చాలా దారుణంగా బయట పలువురు కంటెస్టెంట్స్ మద్దతుదారులు ప్రవర్తించారు. అమర్ దీప్ కారులో వాళ్ళ అమ్మగారు వాళ్ళ భార్య ఉండగానే.. అద్దాలు పగలగొట్టడం బయటికి రమ్మని దుర్భాషలాడి.. కారుని చుట్టుముట్టడం జరిగింది.
దీంతో సకాలంలో అన్నపూర్ణ స్టూడియో వద్దకు పోలీసులు చేరుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అక్కడ జనాలను చెదరగొట్టారు. ఈ క్రమంలో తమ కారుల అద్దాలు పగలడంతో.. గీతు రాయల్, అశ్విని కేసులు పెట్టడం జరిగిందట. అశ్విని తన కారు అద్దాలు పగలగొట్టిన తీరును ఖండిస్తూ వీడియో పెట్టి.. ఈ రకంగా ప్రవర్తించడం మానవత్వం కాదు అంటూ అసహనం చెందింది. కేవలం అందరం గేమ్ కోసం మాత్రమే ఆడటం జరిగింది. ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండొచ్చు గానీ మరీ ఈ రకంగా దాడులు చేయటం అన్యాయమని తెలిపింది.
అన్నపూర్ణ స్టూడియో బయట ఆదివారం జరిగిన దాడులు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా గత సీజన్ లకు భిన్నంగా సీజన్ సెవెన్ షో సాగింది. ఎవరు ఊహించని విధంగా షో నడిపించారు. ఈసారి మొత్తం 19 మంది గెలవడానికి హౌస్ లో ఎంట్రీ ఇచ్చారు. మొదట 14 మంది తర్వాత వైల్డ్ కార్డు రూపంలో ఐదుగురు ఎంట్రీ ఇచ్చారు. కానీ చివరకు రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ కి టైటిల్ రావడం జరిగింది. 30 లక్షల ప్రైజ్ మనీ 15 లక్షల విలువ చేసే కారు, 15 లక్షల విలువ చేసే నెక్లెస్ ప్రశాంత్ గెలవడం జరిగింది. సీజన్ సెవెన్ మొత్తంలో భారీ ఎత్తున ఓటింగ్ రాబట్టింది కూడా రైతుబిడ్డే. సో ఓటింగ్ పరంగా ఫైనల్ లో కూడా పల్లవి ప్రశాంతే గెలవడం జరిగింది.