Supreme Court: ఇప్పటి వరకూ ఎన్నికల సంఘం నిర్ణయాలపై న్యాయస్థానాలు జోక్యం చేసుకోవు అన్న భావన ఉండేది. ఎన్నికల సంఘం కూడా స్వతంత్ర ప్రతిపత్తి కల్గిన సంస్థ కావడంతో తాము తీసుకునే నిర్ణయాలపై న్యాయస్థానాలు జోక్యం చేసుకోవు అనే అభిప్రాయం ఉండేది. దీంతో చాలా వరకు దిగువ కోర్టులు ఈసీ నిర్ణయాలపై జోక్యం చేసుకునేవి కాదు. అయితే ఇప్పుడు ఎన్నికల సంఘం దిమ్మతిరిగేలా సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది.
ఎన్నికల కమిషన్ నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోవచ్చని సుప్రీం కోర్టు శుక్రవారం కీలక తీర్పు ఇచ్చింది. ఎన్నికల కమిషన్ నిర్ణయాల వల్ల రాజకీయ పార్టీలు, వ్యక్తులకు అన్యాయం జరిగితే న్యాయస్థానాలు చూస్తూ ఊరుకోవని ధర్మాసనం స్పష్టం చేసింది. రాజకీయ పార్టీలు అన్నింటికీ సమాన అవకాశాలు కల్పించకపోతే ఎన్నికలు న్యాయంగా ఎలా జరుగుతాయని ధర్మాసనం ప్రశ్నించింది.
లడాఖ్ లో జేకేఎన్సీ పార్టీకి నాగలి గుర్తును కేటాయించడానికి ఎన్నికల కమిషన్ నిరాకరించింది. దీంతో ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని జేకేఎన్సీ పార్టీ సవాల్ చేసింది. దీనిపై జస్టిస్ విక్రమ్ నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదనలు ముగిసిన తర్వాత ఈసీ నిర్ణయాన్ని సుప్రీం ధర్మాసనం తప్పుబట్టింది. ఎన్నికల జాప్యాన్ని నివారించడానికి మాత్రమే ఎన్నికల కమిషన్ నిర్ణయాలను కోర్టులు పట్టించుకోవని ధర్మాసనం చెప్పింది. లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ కల్పించకపోతే ఖచ్చితంగా కోర్టులు జోక్యం చేసుకుంటాయని సుప్రీం ధర్మాసనం స్పష్టత ఇచ్చింది.
Chandrababu: కడప, ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్ చార్జిలను ప్రకటించిన టీడీపీ