గణేశ్ చతుర్థి అంటేనే వినాయకుడిని ప్రతిష్టించడం, ఆయనకు పూజలు చేయడం, తిరిగి నిమజ్జనం చేయడం. వినాయకుడి పండుగ కోసమే వినాయకుడిని అప్పటికప్పుడు తయారు చేస్తాం. మట్టితోనే లేక ఇతర పదార్థాలతో తయారు చేస్తాం.
కానీ.. ఇప్పుడు మనం చెప్పుకోబోయే గణపతి విగ్రహం.. ఇప్పటిది కాదు.. 1100 ఏళ్ల క్రితం నాటిది. నమ్మశక్యంగా లేకున్నా నమ్మాల్సిన నిజం ఇది. అది కూడా చీమలు దూరని చిట్టడవిలో కొండ అంచున కొలువు తీరిన గణేశుడిని చూడటానికి రెండు కళ్లు సరిపోవు.
ఛత్తీస్ గఢ్ లోని బస్తర్ జిల్లాలో పేద్ద అడవి ఉందని అందరికీ తెలుసు కదా. ఆ అడవిలోనే ఈ గణేశుడు కొలువై ఉన్నాడు. నిజానికి బస్తర్ ప్రాంతం అంతా మావోయిస్టులకు నెలవు. అంతా దట్టమైన అడవితో కప్పబడి ఉంటుంది.
ఆ అడవిలోనే ఓ కొండ అంచున ఉన్న ఆ వినాయకుడికి దోల్ కల్ గణేశ్ అని పేరు. నాగవంశీయుల కాలంలో అంటే 1100 ఏళ్ల క్రితం ఈ విగ్రహాన్ని పేద్ద కొండ అంచున ఏర్పాటు చేశారట. అప్పటి నుంచి అక్కడ వినాయకుడి విగ్రహం ఉన్నదని ఎవ్వరికీ తెలియదు.
కానీ.. 2012లో ఓ జర్నలిస్టు అక్కడ ఉన్న కొండను ఎక్కి చూడగా.. కొండ అంచున వినాయకుడి విగ్రహం కనిపించిందట. దీంతో అక్కడ వినాయకుడు ఉన్న సంగతి అందరికీ తెలిసింది. ఆ కొండ మీదికి ఎక్కాలంటే 13 వేల అడుగుల మీదికి చేరుకోవాలి. దట్టమైన అడవి లోపల 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండపై ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
ఇక.. అక్కడ వినాయకుడి విగ్రహం ఉందని తెలుసుకున్న సమీప గ్రామాల ప్రజలు.. వినాయకుడిని దర్శించుకోవడానికి తరుచూ అక్కడికి వస్తుంటారు. అయితే.. గతంలో ఓసారి గణేశుడి విగ్రహం కొండ నుంచి కింద పడి ముక్కలు అయిందట. భక్తులను ఇబ్బంది పెట్టవద్దని అధికారులే అక్కడ మళ్లీ విగ్రహాన్ని పున:ప్రతిష్టించారట. అది ఆ వినాయకుడి ప్రస్థానం.
To reacH to this place. From Dantewada you have to reach a small vilaage Midkulnar which is around 20 kms away. Then you have to do a trek of about 5-7 kms to reach the top of the hill. Pic from net.
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) August 22, 2020