NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్

ఏడాదిలో ఏకంగా 4700 కేసులు..! బాల్యం మసకబారుతుంది..!!

 

(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)

ప్రస్తుతం సమాజంలో మహిళలు, బాలికలపై లైకింక వేధింపులు ఎక్కవగా జరుగుతున్నాయి. ముఖ్యంగా అభం సుభం తెలియని చిన్నారులపై కామాంధులు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. దీంతో అటపాటలతో సరదాగా సాగాల్సిన చిన్నారులు కామాందుల కబంధ హస్తాల్లో చిక్కుకుని శారీరకంగా, మానసికంగా కుంగిపోతున్నారు.

రాష్ట్రంలో గత సంవత్సరం ఏప్రిల్ నెల నుండి ఈ ఏడాది ఆగస్టు వరకూ చైల్డ్ వెల్ఫేర్ కమిటి దృష్టికి వచ్చిన వివరాల ప్రకారం చిన్నారుల వేధింపులకు సంబంధించి 4,700 కేసులు నమోదు అయ్యాయి. పలు సంఘటనలు జరిగిన తర్వాత బాధితుల ఫిర్యాదు మేరకు సిడబ్ల్యుసీ దృష్టికి రాగా, మరి కొన్ని సంఘటనలు పోలీస్ శాఖ నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం ద్వారా వెలుగులోకి వచ్చాయి. పలకా బలపం పట్టుకుని పాఠశాలలకు వెళ్లాల్సిన వయస్సులో ఆకలి తీర్చుకోవడానికి యాచన వృత్తికి మళ్లించడం, బాల కార్మికులుగా మార్చడం వల్ల వారు చట్టవిరుద్దమైన పనుల్లో చిక్కుకుంటున్న సంఘటనలు వెలుగులోకి వచ్చాయి.

అధికంగా పశ్చిమ గోదావరిలో కేసులు

దేశ వ్యాప్తంగా చిన్నారులపై జరిగిన వేధింపులకు సంబందించి రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం వివరణ కోరగా రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కేంద్రానికి నివేదక అందజేసింది. ఆ లెక్కల ప్రకారం చిన్నారులపై వేధింపుల కేసులు అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 1,172 నమోదు అయినట్లు లెక్కలు చెబుతున్నాయి. శ్రీకాకుళంలో 781, ప్రకాశంలో 674, విశాఖలో 516లు, కడపలో 239గ, విజయనగరంలో 106 కేసులు నమోదు అయ్యాయి.

కరోనా లాక్ డౌన్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలు, వసతి గృహాలు మూతపడిన పడిన విషయం తెలిసిందే. సంరక్షణ కేంద్రాల్లో ఉన్న చిన్నారులను ఇళ్లకు పంపించారు. తల్లిదండ్రుల సంరక్షణలో పిల్లలు ఉన్నా బాలికలపై వేదింపులు తగ్గలేదు. సాధారణ రోజుల కంటే కరోనా లాక్ డౌన్ కాలంలో భౌతిక, లైంగిక వేధింపులు కాస్త తగ్గినట్లుగా నివేదికలు చెబుతున్నాయి. లాక్ డౌన్ ప్రారంభమైన మార్చి నెల నుండి ఆగస్టు వరకూ మధ్య కాలంలో 1,642 కేసులు నమోదు అయ్యాయి. లాక్ డౌన్ కాలంలోనూ పశ్చిమ గోదావరి జిల్లాలోనే అత్యధికంగా చిన్నారులపై 577 వేధింపు ఘటనలు వెలుగులోకి వచ్చాయి.

ప్రధానంగా చిన్నారులను ఒంటరిగా వదలడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయనీ నిపుణులు పేర్కొంటున్నారు. చిన్నారుల పట్ల పెద్దల పర్యవేక్షణ ఉంటే వీటిని నివారించవచ్చని పేర్కొంటున్నారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ దృష్టికి వచ్చిన ప్రతి కేసును విచారించిన ఎలాంటి సంరక్షణ లేని 1,224 మంది పిల్లలను ప్రభుత్వ ప్రత్యేక వసతి కల్పించారు. మిగిలిన 3212 మంది చిన్నారులను వారి తల్లిదండ్రులకు అప్పగించారు.

 

Related posts

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella