బాలీవుడ్ స్టార్ హీరోయిన్ క్వీన్ కంగన రనౌత్ గురించి అందరికీ తెలిసిందే. ప్రతీ విషయంలోను డేరింగ్ అండ్ డాషింగ్ గా వ్యవహరిస్తుంది. ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా ఏకిపారేస్తుంది. సంచలన ఆరోపణలు చేస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు బాలీవుడ్ మత్తు వదిలించేస్తోంది. దశాబ్ధాల పాటు డ్రగ్స్ మత్తులో ఊగిపోతున్న చీకటి ప్రపంచపు రహస్యాలన్నిటినీ ఒక్కొక్కటిగా ఓపెన్ చేస్తూ హడలెత్తిస్తుంది. తాజా ఇంటర్వ్యూలో కంగన చేసిన వ్యాఖ్యలు పెద్ద సంచలనం గా మారాయి.
బాలీవుడ్ డ్రగ్ మాఫియాతో ఇక్కడ చాలా మంది హీరోలకు సంబంధాలున్నాయని.. 90 శాతం మందికి డ్రగ్స్ కి అలవాటు పడ్డారని బాంబు పేల్చింది. అంతేకాదు కొన్ని పేర్లను బయట పెట్డడంతో ఇప్పుడు అన్ని చోట్లా హాట్ టాపిక్ గా మారింది. నేను డేటింగ్ చేసిన ఒక స్టార్ హీరో డ్రగ్స్ కి బానిసని పార్టీల్లో అదుపు తప్పుతాడని వెల్లడించింది. ఆ హీరో హృతిక్ రోషన్ అని చెప్పకనే చెప్పింది.
అలాగే నటవారసుడు అయిన రణబీర్ కపూర్ తో పాటు రణ్ వీర్ సింగ్.. వికీ కౌశల్ లాంటి హీరోలకు రక్త పరీక్షలు చేయిస్తే డ్రగ్స్ కి బానిసలా కాదా అన్నది బయటపడుతుందని టాప్ సీక్రెట్స్ బయట పెట్టింది. చిన్నా పెద్దా హీరోలు అనే తేడా లేకుండా లేట్ నైట్ పార్టీల్లో అందరూ డ్రగ్స్ తీసుకుంటారని.. కరణ్ జోహార్ సహా స్టార్ కిడ్స్ పార్టీలకు వస్తుంటారు. వీళ్లంతా డ్రగ్స్ మత్తులో మునిగి తేలుతారని కంగన అభిప్రాయపడింది. తనకు గ్యాంగ్ స్టర్ సినిమాతో మొదటి అవకాశం ఇచ్చిన ప్రముఖ బాలీవుడ్ నిర్మాత మహేష్ భట్ తనకు డ్రగ్స్ అలవాటు చేశారన్న విషయాన్ని తెలిపింది.
ఇలా కంగనా తాజాగా చేసిన వ్యాఖ్యలకు బాలీవుడ్ మొత్తం షేకవుతోంది. స్టార్ హీరోలతో పాటు మరికొందరు మేకర్స్, హీరోయిన్స్ కి దడ మొదలైందని తెలుస్తుంది. మొత్తానికి కంగనా చేసిన ఈ సంచలన వ్యాఖ్యలతో బాలీవుడ్ మత్తు వదలడం ఖాయమని అంటున్నారు.