Acharya : టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఆచార్య. మే13 న రిలీజ్ అని ప్రకటించడంతో మెగా అభిమానులతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. ఎందుకంటే ఆచార్య సినిమా మొదలై రెండేళ్ళు అవుతోంది. గత ఏడాదే రిలీజ్ కావాల్సింది కరోనా ఫస్ట్ వేవ్ వల్ల పోస్ట్ పోన్ అయింది. ఈ ఏడాది అనుకుంటే సెకండ్ వేవ్ అడ్డు పడింది. మొత్తానికి అభిమానుల ఆశల మీద నీళ్ళు చల్లిన కరోనా రెండు సార్లు ఆచార్య సినిమా రిలీజ్ కి ఆటంకం కలిగించింది. షూటింగ్ పూర్తయినా కనీసం పే ఫర్ వ్యూ పద్దతిలో ప్రముఖ ఓటీటీలో అయినా రిలీజ్ కి ప్లాన్ చేసుండేవారేమో.
కానీ షూటింగ్ దశలోనే ఆచార్య ఆగిపోయింది. కాగా ఓవరాల్ గా ఆచార్య సినిమాకు 12 రోజుల షెడ్యూల్ సరిపోతుందట. చిన్న ప్యాచ్ వర్క్ మాత్రమే ఉండటంతో 12 నుంచి 14 రోజులు సరిపోతుందట. త్వరలో ఆ ప్యాచ్ వర్క్ పూర్తి చేసేందుకు షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే టాలీవుడ్ సినిమాలు బ్యాలెస్ షూటింగ్ జరుపుకుంటున్నాయి. థియేటర్స్ ఓపెన్ అవడమే ఆలస్యం రిలీజ్ కి రెడీగా ఉన్న సినిమాలు క్యూ కట్టనున్నాయి. థియేటర్స్ రిలీజ్ తో పాటు ఓటీటీలల్లో కూడా తెలుగు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. వారానికి కనీసం 5-6 సినిమాలైనా బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి.
Acharya : వీటిని దాటుకొని ఆచార్య వస్తుందా లేక మరో సోలో డేట్ చూసుకుంటుందా చూడాలి.
ఈ క్రమంలో ఆచార్య బ్యాలెన్స్ షూటింగ్ పూర్తి కాగానే రిలీజ్ డేట్ పై మేకర్స్ ఓ క్లారిటీకి వచ్చి కొత్త డేట్ ని అనౌన్స్ చేయనున్నారు. అన్నీ పరిస్థితులు అనుకూలిస్తే విజయదశమి పండుగ సందర్భంగా అక్టోబర్ లో రిలీజ్ చేయడం పక్కా అంటున్నారు. అయితే అప్పటికి ఆర్ఆర్ఆర్ బరిలో ఉంది. ఒకవేళ ఈ సినిమా పోస్ట్ పోన్ అయితే ఆ సమయంలో పుష్ప పార్ట్ వన్, అఖండ, రాధే శ్యాం, కేజీఎఫ్ 2 లాంటి సినిమాలు బరిలో దిగనున్నాయి అంటున్నారు. మరి వీటిని దాటుకొని ఆచార్య వస్తుందా లేక మరో సోలో డేట్ చూసుకుంటుందా చూడాలి. ఇక ఇందులో కాజల్ అగర్వాల్ చిరంజీవికి జంటగా నటిస్తుంది. చరణ్ – పూజా హెగ్డే కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!