దర్శకుడు క్రిష్ ( జాగర్ల మూడి రాధాకృష్ణ) .. తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక భారీ పీరియాడిక్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని శ్రీసూర్య మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఎ.ఎం రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో దొంగ గా కనిపించబోతున్నాడన్న ప్రచారం జరుగుతుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా కొంత వరకు టాకీ పార్ట్ కంప్లీట్ చేసుకుంది. బాలీవుడ్ హీరోయిన్ కీలక పాత్ర పోషిస్తున్న వార్తలు వస్తున్నప్పటికీ ఇంకా ఈ విషయంలో అధికారకమైన ప్రకటన వెలువడలేదు.
అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఇప్పట్లో షూటింగ్స్ మొదలయ్యే సూచనలు లేవని అంటున్నారు. పవన్ కళ్యాణ్ డిసెంబర్ వరకు ఏ సినిమా షూటింగ్ లో పాల్గొనలేకపోవడమే అందుకు కారణం. కరోనా వ్యాప్తి తో పాటు ఇతర కారణాల వల్ల “వకీల్ సాబ్” సినిమా కోసం డిసెంబర్ నుంచి చిత్రీకరణకి వస్తాడని తెలుస్తుంది. ముందు వకీల్ సాబ్ కంప్లీట్ చేశాకే క్రిష్ సినిమాలో జాయిన్ అవుతాడట.
అంతేకాదు మళ్ళీ క్రిష్-పవన్ కళ్యాణ్ సినిమా సెట్స్ మీదకి వచ్చేది 2021 లోనే అని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. అందుకే ఈ గ్యాప్ లో క్రిష్ మరో సినిమాని ఫినిష్ చేయబోతున్నాడు. అదే మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందనున్న సినిమా. ఈ సినిమాని క్రిష్ సింగిల్ షెడ్యూల్ లో కంప్లీట్ చేసేలా సన్నాహాలు చేసుకుంటున్నట్టు తాజా సమాచారం. ఇక ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. త్వరలో ఇందుకు సంబంధించిన అఫీషియల్ న్యూస్ రానుందట. మొత్తానికి రకుల్ మళ్ళీ మెగా కాంపౌండ్ లో చేరబోతుంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!