SBI Alert: మీకు SBI బ్యాంక్ అకౌంట్ వున్నట్లైతే, ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తలు వహించకతప్పదు. లేదంటే మీ బ్యాంక్ అకౌంట్ పూర్తిగా ఖాళీ అయిపోతుంది. ఏమాత్రం ఏమరపాటు వహించినా కేటుగాళ్లు మిమ్మల్ని బురిడి కొట్టిస్తారు. ఎప్పుడు ఎవరు ఎలా మోసం చేస్తారో చెప్పడానికి కూడా ఉండదు. అందుకే మన జాగ్రత్తల్లో మనం ఉండాలి. ఈ నేపథ్యంలోనే SBI తాజాగా తన కస్టమర్లను అలర్ట్ చేస్తోంది. ముఖ్యంగా KYC మోసాలతో కాస్త అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది. ట్విట్టర్ వేదికగా బ్యాంక్ ఈ విషయాన్ని తెలపడం గమనార్హం.
SBI: మీకు సుకన్య సంవృద్ధి యోజన అకౌంట్ కావాలా? అయితే ఇపుడు మీకు SBI ఖాతా ఉంటే సరిపోతుంది!
SBI Alert: వాళ్ళు ఇలా మోసం చేస్తారు?
‘డియర్ కస్టమర్, KYC పూర్తికాని కారణంగా మీ SBI బ్యాంక్ అకౌంట్ రద్దు చేయబడింది. కేవలం 10 నిమిషాల్లో KYC అప్డేట్ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. దానికోసం ఈ లింక్పై క్లిక్ చేసి, KYC వివరాలను అప్డేట్ చేసుకోండి!’ అని మీ ఫోన్కు మెసేజ్లు వస్తాయి. ఇలాంటి SMSలతో జాగ్రత్తగా ఉండాలని స్టేట్ బ్యాంక్ తన కస్టమర్లను సూచిస్తోంది. ఈ ప్రక్రియ ద్వారా KYC మోసగాళ్లు బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు తస్కరించొచ్చని హెచ్చరిస్తోంది. ఒకవేళ ఇలాంటి లింకులు వస్తే, ఎట్టి పరిస్థితుల్లోనే క్లిక్ చేయవద్దని బ్యాంక్ తన కస్టమర్లను కోరుతోంది.
SBI కస్టమర్లు ఈ విషయం గ్రహించారా? ఆధార్ పాన్ లింక్ చేయకుంటే జరిగేది ఇదే!
ఇంకా ఇలాంటి మోసాలనుకూడా మీరు చూడవచ్చు!
SBI నెట్ బ్యాంకింగ్ అకౌంట్ బ్లాక్ అయ్యిందని కొందరికి, SBI అకౌంట్ బ్లాక్ అయ్యిందని మరి కొందరికి, KYC పూర్తి చేసుకోండని ఇంకొందరికి ఇలా రకరకాలు దార్లు సదరు కేటుగాళ్లు ఎంచుకుంటారు. అందుకే ఇలాంటి ప్రకటనలపట్ల ఆచితూచి వ్యవహరించాలి. అలాంటివి ఎప్పుడు కూడా బ్యాంక్ నుండి నేరుగా రావని గ్రహించాలి. ముఖ్యంగా మీ OTPని ఎవ్వరికీ చెప్పవద్దని SBI కస్టమర్లను కోరుతోంది.