AP DSC: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కోడ్ ముగిసే వరకూ టెట్ ఫలితాలు, డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ) ను షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తారా .. ? వాయిదా వేస్తారా ? అనే సందిగ్ధతకు ఈసీ తెరదించింది.
హైకోర్టు ఆదేశాల మేరకు ఇప్పటికే డీఎస్సీ షెడ్యూల్ ను మార్చిన పాఠశాల విద్యాశాఖ అధికారులు.. మార్చి 30 నుండి ఏప్రిల్ 30 వరకూ నిర్వహిస్తామని ఇటీవల ప్రకటించారు. ఈ నెల 20 నుండి ఇచ్చికాలు నమోదు చేసుకోవాలని, 25 నుండి హాట్ టికెట్ లు డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. కానీ ఇంత వరకూ వెబ్ సైట్ లో పరీక్ష కేంద్రాల ఎంపికకే అవకాశం ఇవ్వలేదు.
ఈ నేపథ్యంలో శనివారం సీఈఓ దీనిపై ప్రకటన జారీ చేయడంతో అభ్యర్ధుల ఉత్కంఠకు తెరపడింది. మరో పక్క ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలను ఈ నెల 14న విడుదల చేయాల్సి ఉండగా ఇంత వరకూ విడుదల చేయలేదు. ఈసీ నిర్ణయం మేరకు కోడ్ ముగిసే వరకూ టెట్ ఫలితాల కోసం ఎదురు చూడాల్సిందే.
EC: ఈసీ కీలక ఆదేశాలు .. వాలంటీర్లతో పింఛన్ లు పంపిణీ చేయించొద్దు