CM YS Jagan: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్మోహనరెడ్డి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి రాజధాని ప్రాంతంలో ఉపాధి కోల్పోయిన, భూమి లేని నిరుపేదలకు ఇచ్చే ఫించన్ ను పెంచుతూ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం వారికి రూ.2,500లు పింఛన్ ను ఇస్తుండగా, దాన్ని రూ.5వేల కు పెంచుతూ మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో విడుదల చేసింది.
ఇటీవల గుంటూరు జిల్లా ఫిరంగిపురం లో జరిగిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ .. అమరావతి ప్రాంతంలో ఉపాధి కోల్పోయిన భూమిలేని నిరుపేదలకు ఇచ్చే పింఛన్ మొత్తాన్ని పెంచుతామని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ఏపీ ప్రభుత్వం వారికి పింఛన్ మొత్తాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తాడికొండ, మంగళగిరి ప్రాంతాల్లో ఉపాధి కోల్పోయి, భూములు లేక 17 వేల కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయని మాజీ హోంశాఖ మంత్రి, తాడికొండ నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జి మేకతోటి సుచరిత సీఎం జగన్ దృష్టికి తీసుకువచ్చారు.
వీరి పింఛన్ ను రూ.5వేలకు పెంపు చేయాలని సీఎం జగన్ కు అభ్యర్ధిస్తూ వినతి పత్రాన్ని అందించారు. మేకతోటి సుచరిత అభ్యర్ధనపై సానుకూలంగా స్పందించిన సీఎం జగన్ .. వచ్చే నెల నుండి పింఛన్ మొత్తాన్ని రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చారు. సీఎం జగన్ ఆదేశాలతో వారికి ఇచ్చే పింఛన్ ను రెట్టింపు చేస్తూ మార్చి1వ తేదీ నుండి అందించేలా ఉత్తర్వులు జారీ అయ్యాయి.
Mudragada Padmanabham: పవన్ కళ్యాణ్ కు ముద్రగడ ఘాటు లేఖ.. విషయం ఏమిటంటే..?