(అమరావతి నుండి న్యూస్ ఆర్బిట్ ప్రతినిధి)
శాసన మండలి చైర్మన్ షరీఫ్ కరోనా బారి నుండి కోలుకున్నారు. రెండు వారాల క్రితం షరీఫ్ కు కరోనా సోకిన విషయం తెలిసిందే. ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో హైదరాబాదులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరి వారం రోజుల పాటు చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు.
గత 11 రోజులుగా హోం క్వారంటైన్ లో ఉన్నారు. నిన్న మరో మారు కరోనా టెస్ట్ (ఆర్ టి పి సి ఆర్) చేయించగా నెగటివ్ రిపోర్టు వచ్చినట్లు శాసన మండలి కార్యాలయ ప్రతినిధి పత్రికా ప్రకటన విడుదల చేశారు. వైద్యుల సలహా మేరకు మరి కొన్ని రోజులు విశ్రాంతిలో ఉంటారని ప్రకటనలో తెలిపారు.