హమ్మయ్య.. చరిత్రలోనే తొలిసారి కావచ్చు.. ఏకంగా ఆరు నెలల పాటు పాఠశాలలు మూసి ఉండటం. ఒక్క పాఠశాలలే ఏంటి.. అన్ని విద్యాసంస్థలు మూతపడ్డాయి. అయితే.. ఏపీలో విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది.
స్కూల్స్, కళాశాలు, మిగితా విద్యాసంస్థలు అన్ని తెరుచుకోవచ్చని అనుమతి ఇచ్చింది. అన్ లాక్ 4.0 లో భాగంగా… ఈనెల 21 నుంచి అన్ని రాష్ట్రాల్లో విద్యాసంస్థలు తెరుచుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసింది.
అయితే కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆ మార్గదర్శకాల ప్రకారం మాత్రమే విద్యాసంస్థలు, విద్యార్థులు నడుచుకోవాలని ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం.
9 నుంచి 12 తరగతులకు మాత్రం స్కూళ్లలో క్లాసులు నిర్వహించేందుకు కేంద్రం అనుమతిచ్చింది. అది కూడా విద్యార్థులకు ఇష్టమైతేనే స్కూళ్లకు వెళ్లొచ్చు. లేదంటే ఇంట్లోనే ఉండి ఆన్ లైన్ క్లాసులను వినొచ్చు. మిగితా తరగతులు అంటే 1 నుంచి 8 వరకు ఖచ్చితంగా ఆన్ లైన్ లోనే బోధన ఉంటుంది.
మార్గదర్శకాలు ఇవే…
కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ప్రస్తుతం అందరూ ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో.. వాటినే విద్యార్థులు, ఉపాధ్యాయులు ఖచ్చితంగా పాటించాలి.
మాస్కులు, శానిటైజర్లు తప్పనిసరి
స్కూల్ గేటు వద్దే శానిటైజర్లను ఏర్పాటు చేయాలి.. మాస్కు లేకుండా ఎవ్వరికీ స్కూల్ లోకి ఎంట్రీ ఉండదు
విద్యార్థులు కూర్చునే కుర్చీల మధ్య కనీసం 6 అడుగుల దూరం ఉండాలి..
విద్యార్థులు కూడా వేరే విద్యార్థులను చేతులతో తాకరాదు
ఎవరి వస్తువులు వాళ్లే వాడాలి.. వేరే వాళ్లకు ఇవ్వకూడదు
ఎవ్వరి ఫుడ్డు వాళ్లే తెచ్చుకొని తినాలి
క్యాంటీన్లు మూసేయాలి