పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా తర్వాత కూడా వరసగా క్రేజీ ప్రాజెక్ట్స్ ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లు రాజకీయాల్లో బిజీ బిజీగా గడిపిన పవన్ కళ్యాణ్ మళ్లీ ఎట్టకేలకు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఓ వైపు రాజకీయాల్లో క్రియా శీలక పాత్ర పోషిస్తూనే..మరో వైపు సినిమాలు కమిటయ్యాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ బాలీవుడ్ లో సూపర్ హిట్ సాధించిన మూవీకి రీమేక్ గా వకీల్ సాబ్ సినిమా చేస్తుండగా రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది.
ఇక వకీల్ సాబ్ తరువాత పవన్ అయ్యపనుమ్ కోషియం మూవీ చేస్తారని అందరూ భావించారు. వాస్తవంగా కూడా అదే సినిమా చేస్తానని పవన్ కూడా వెల్లడించాడు. అయితే అనూహ్యంగా పవన్ నెక్ట్ మూవీ క్రిష్ తో చేస్తున్నాడని టాక్స్ వినిపిస్తున్నాయి. అయితే వకీల్ సాబ్ తో పాటు పవన్ కళ్యాణ్ చేయాల్సిన క్రిష్ దే. కాని కరోనా కారణంగా అన్నీ సినిమాల షెడ్యూల్స్ తారుమారయ్యాయి. కాగా మళయాలంలో సూపర్ డూపర్ హిట్ సాధించిన అయ్యప్పనుమ్ కోషియం మూవీలో పవన్, రానా నటిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన కంఫర్మేషన్ కూడా వచ్చేసింది.
ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సెట్ మీదకు వెళ్తుందని అందరూ భావించారు. అయితే సినిమాకు సంబంధించి నటీనటులతో ఇంకా అగ్రిమెంట్స్ కానందువల్లే పవన్ క్రిష్ సినిమాతో సెట్స్ మీదకి వెళ్ళబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. ముందుగా క్రిష్ తో మూవీ చేసి ఆ తరువాత ఈ రీమేక్ మూవీ చేసేందుకు పిక్స్ అయ్యారట పవన్. ఈ మూవీలో సాయిపల్లవి, ఐశ్వర్యా రాజేష్, సముద్రఖని, నటిస్తున్నట్టు సమాచారం. కాని ఇందుకు సంబంధించి ఇంకా ఎలాంటి కంఫర్మేషన్ రాలేదు. కాగా పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ నుంచి భారీ సర్ప్రైజ్ న్యూ ఇయర్ సందర్భంగా రాబోతోందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం.
Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!