ప్రస్తుతం మన ఇండియాలో ఉన్న భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్ లో బాహుబలి తర్వాత అన్ని భాషల్లోనూ విపరీతమైన క్రేజ్ సాధించిన సినిమా ‘కేజీయఫ్ చాప్టర్ 2″. కన్నడ రాకింగ్ స్టార్ యష్, శ్రీనిధి శెట్టి హీరో, హీరోయిన్స్ గా నటిస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు. ‘కేజీయఫ్ చాప్టర్ 1 ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. దాంతోసినిమా కి సీక్వెల్ గా భారీ యాక్షన్ సీక్వెన్స్ తో చాప్టర్ 2 ను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్.
ఇప్పటికే 70 శాతం కి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా వల్ల అన్ని సినిమా ల మాదిరిగానే ఆపాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఈ సినిమా చిత్రీకరణ తిరిగి ఎప్పుడు మొదలవుతుందో .. రిలీజ్ ఎప్పుడవుతుందో అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఆగస్ట్ మూడవ వారం నుంచి మొదలు పెట్టబోతున్నట. ఈ షెడ్యూల్ లో దాదాపు చిత్రీకరణ ని కంప్లీట్ చేస్తారని అంటున్నారు. అయితే క్లైమాక్స్ మాత్రం ఈ షెడ్యూల్ లో ప్లాన్ చేయడం లేదని తెలుస్తుంది. అందుకు కారణం బాలీవుడ్ నడుటు సంజయ్ దత్ అని తెలుస్తుంది.
ప్రస్తుతం సంజయ్ దత్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. అందుకే ఆయన లేకుండా మిగతా సన్నివేశాలను తీయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఆ తర్వాత సంజయ్, యష్ ల మధ్య క్లైమాక్స్ సీన్స్ తియ్యాలని దర్శకుడు ప్లాన్ చేస్తున్నారట. ఈ ప్రకారం చూస్తే ‘కేజీయఫ్ చాప్టర్ 2 2021 లోనే రిలీజ్ కానుందని తెలుస్తుంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!