Groundnuts: వేరు శనగ Groundnuts గింజల్ని వేపుకొని, ఉడకబెట్టుకొని, స్నాక్స్లో, స్వీట్స్లో రకరకాలుగా తినడానికి ఉపయోగిస్తుంటాము. వీటిలో ఉండే విటమిన్ ఇ, సెలీనియం, ఫైబర్, జింక్ శరీర సౌందర్యానికి కావలసిన హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. రక్త ప్రసరణ ను మెరుగు చేసి, మంచి ఆరోగ్యం తో పాటు చర్మ సౌందర్యాన్ని ఇస్తాయి. మనలో చాలా మంది చేస్తున్న పొరపాటు ఏమిటంటే, మనం వేరుశనగ గింజల్ని తింటాం కానీ ఆ గింజల పై ఉండే పొట్టు నోటికి కాస్త చేదుగా ఉంటుంది కాబట్టి తీసేస్తున్నాం. కానీ వేరు శనగల్ని పొట్టు తో సహా తినమంటున్నారు ఆరోగ్య నిపుణులు అది ఎందుకో తెలుసుకుందాం.
వేరుశనగ గింజల పొట్టు లో ఆరోగ్యాన్ని పెంచే, చాలా పోషకాలున్నాయి. తొక్కల్లో ఎక్కువగా ఉండే బయోయాక్టివ్స్, ఫైబర్… వ్యాధులు రాకుండా చేస్తాయి . తొక్కల్లో ఉండే పాలీఫెనాల్,బాడీలో కలిసిపోయి చర్మాన్ని రక్షణ గా ఉంటుంది. చర్మం ఎండిపోకుండా చూస్తుంది. వేరుశనగ పొట్టులో గుండె జబ్బులు, కాన్సర్, హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకునే లక్షణాలు ఉన్నాయి. బ్లూబెర్రీ పండ్లతో పోల్చి చూస్తే, వేపిన వేరుశనగ తొక్కల్లోనే విష వ్యర్థాల్ని అడ్డుకునే గుణాలు ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనలు తెలియచేస్తున్నాయి.
వేరు శెనగ పొట్టులో ఉండే ఫైబర్,శరీర అధిక బరువును తగ్గిస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచి… శరీరం లో నిల్వ ఉన్న కొవ్వును కరిగిస్తోంది.ద్రాక్షపండ్లు, వైన్లో రెస్వెరాట్రాల్ అనే పదార్థం ఉంటుంది. అదే వేరుశనగ తొక్కల్లో కూడా ఉంది . అది మనలో సహనాన్ని పెరిగేలా చేస్తుంది. పరిశోధనలు చెబుతున్నదొక్కటే… వేరుశనగల్ని పచ్చిగా గానీ, వేపి గానీ, ఉడకబెట్టి గానీ, బటర్లా గానీ ఎలా తిన్నాకూడా వాటి పొట్టు తో సహా తినాలి . రోజూ ఓ గుప్పెడు వేరుశనగల్ని తొక్కతో సహా తింటే… బోలెడంత ఆరోగ్యం గా ఉండవచ్చు. ఇది మనలని భయంకరమైన కేన్సర్, గుండె జబ్బుల నుంచీ రక్షిస్తుంది.