ఉత్తరాదిలో బలంగా ఉన్న భారతీయ జనతా పార్టీ ఎప్పటినుండో దక్షిణాదిలో కూడా రాణించాలని అనేక వ్యూహాలను , అవకాశాలను వెతుక్కుంటూ ఉంది. ఇటువంటి తరుణంలో ఇటీవల దక్షిణాదిలో తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల్లో అదేవిధంగా దుబ్బాక ఉపఎన్నికల్లో రాణించడంతో కొద్దోగొప్పో బీజేపీకి ఇక్కడ గెలిచే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
దీంతో దక్షిణాది పై సీరియస్ ఫోకస్ పెట్టిన బీజేపీ తమిళనాడులో త్వరలో జరగబోయే ఎన్నికల్లో రాణించడానికి భారీగానే అండర్ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేయటమే కాక ఇటీవల సంక్రాంతి పండుగ నేపథ్యంలో బిజెపి పార్టీకి చెందిన కీలక నేతలు తమిళ ప్రజలను ఆకట్టుకోవడానికి అనేక ఫీట్లు కూడా వేయడం జరిగింది. దీనిలో భాగంగానే ఇతర పార్టీలతో కలుస్తూ.. శశికళ మరో జయలలిత కాకుండా ఎక్కడికక్కడ అణగదొక్కడం జరిగింది.
కాగా ఏ ఐడీఎంకే పార్టీ తో కలిసి రాజకీయాలు చేసిన బిజెపి కి జరగబోయే ఎన్నికలలో ఈ కూటమికి పెద్దగా ఓటింగ్ వచ్చే అవకాశం లేనట్లు తాజాగా ఇటీవల జరిపిన ఓ సర్వేలో ఫలితాలు బయటపడ్డాయి. వరుసగా రెండు సంవత్సరాలు ఏఐఏడీఎంకే పార్టీ అధికారంలో ఉండటంతో.. సహజసిద్ధంగానే వ్యతిరేకత ఉండటంతో ఓటమి గ్యారెంటీ అని సర్వే ఫలితాలు చెబుతున్నాయి. మరోపక్క ఇదే సర్వేలో ఈసారి కచ్చితంగా డీఎంకే పార్టీ గెలవడం గ్యారెంటీ అనే టాక్ వినిపిస్తోంది. దీంతో తమిళనాడులో బీజేపీ వేసిన అంచనాలు విఫలమైనట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.