అమరావతి: తన కుమారుడి వివాహానికి రావాల్సిందిగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఆహ్వానించారు. సోమవారం ఉదయం జగన్తో భేటీ అయిన సీఎం రమేష్.. తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను అందించారు. ఈ భేటీలో ఎలాంటి రాజకీయ అంశాలు చర్చకు రాలేదని సమాచారం. టీడీపీ అధినేత చంద్రబాబును కూడా సీఎం రమేష్ తన కుమారుడి వివాహానికి ఆహ్వానించనున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులను, సినీ ప్రముఖులను ఆయన ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రధాని మోదీని సకుటుంబ సపరివారంగా కలిసి వివాహానికి రావాల్సిందిగా సీఎం రమేష్ ఆహ్వానించారు. ఏపీకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త తాళ్లూరి రాజా కుమార్తె పూజతో, సీఎం రమేష్ కుమారుడు రిత్విక్ నిశ్చితార్థం దుబాయ్లో కొద్దిరోజుల క్రితం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.
previous post
next post