(హైదరాబాద్ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు కూతవేటు దూరంలో భారీ పేలుుడు తీవ్ర కలకలాన్ని రేపింది. ఈ ఘటన ముత్యాలమ్మ ఆలయ సమీపంలో ఆదివారం ఉదయం జరిగింది. ఆలయ వద్ద ఉన్న చెత్తకుప్పలో వ్యర్ధాలను తొలగించేందుకు వచ్చిన ఒ వ్యక్తికి చెత్తలో ఒక పెయింట్ డబ్బా కనిపించింది. అతను దాన్ని తెరిచే ప్రయత్నం చేయడంతో భారీ పేలుడు సంభవించింది ఈ ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రుడిని హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో డాగ్, బాంబ్ స్క్వాడ్ బృందాలు అక్కడికి చేరుకుని తనిఖీలు జరిపాయి. గాయపడిన వ్యక్తి నిజామాబాద్ ప్రాంతానికి చెందిన రాజు అనే వ్యక్తిగా గుర్తించారు. పేలింది ఒక టిన్నర్ (పెయింటింగ్) డబ్బా అని ప్రాధమికంగా గుర్తించారు. దసరా పండుగ రోజున అమ్మవారి ఆలయానికి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఈ ఘటనతో ఆలయానికి వచ్చిన భక్తులు, స్థానికులు భయాందోళనకు గురి అయ్యారు.