(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
క్షమాపణ చెప్పని పక్షంలో బాలీవుడ్ స్టార్ కంగనా రనౌత్ను బహిష్కరిస్తామని ముంబై సినిమా జర్నలిస్టులు అల్టిమేటం జారీ చేశారు. గత ఆదివారం జడ్జిమెంటల్ హై క్యా సినిమా పాట విడుదల ఈవెంట్లో కంగన జస్టిన్ రావు అనే జర్నలిస్టుపై ఆరోపణలు చేశారు. అక్కడ ఇద్దరి మధ్యా జరిగిన వాగ్యుద్ధం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఫిల్మ్ జర్నలిస్టుల సంఘమైన ఎంటర్టైన్మెంట్ జర్నలిస్ట్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా జడ్జిమెంటల్ హై క్యా సినిమా నిర్మాత ఏక్తా కపూర్కూ, కంగనకూ అల్టిమేటం జారీ చేసింది. ఇద్దరూ తమకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఏక్తా కపూర్ వెంటనే క్షమాపణ చెప్పారు కూడా. వివాదంలో ఉన్నవారి సంగతి ఎలా ఉన్నా అది జరిగింది తమ సినిమా ఈవెంట్లో కాబట్టి తాను క్షమాపణ చెబుతున్నట్లు ఆమె ట్వీట్ చేశారు. అయితే కంగన అందుకు రెడీగా లేదు. కంగన క్షమాపణ చెప్పదు కాక చెప్పదని ఆమె సోదరి, మేనేజర్ కూడా అయిన రంగోలీ చందేల్ మంగళవారం ట్వీట్ చేశారు. అందులో ఆమె ఫిల్మ్ జర్నలిస్టులను అవమానించే రాతలు రాశారు.
ఆదివారం నాటి ఈవెంట్లో జర్నలిస్టు జస్టిన్ రావు తనను ప్రశ్నిస్తున్నపుడు, కంగన అతనిపై ఆరోపణలు చేశారు. తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె అన్నారు. జడ్జిమెంటల్ హై క్యా సినిమా ఇప్పటికే వివాదాలలో ఉంది. మొదట ఈ సినిమాకు మెంటల్ హై క్యా అనే టైటిల్ నిర్ణయించారు. దానికి అభ్యంతరం రావడంతో టైటిల్ మార్చారు. ఈ సినిమా జూలై 26న విడుదల కానున్నది.
#WATCH Kangana Ranaut has a spat with a reporter, accuses him of smear campaign, at the 'Judgementall Hai Kya' song launch event in Mumbai. (07.07.2019) pic.twitter.com/sNuWduY3yg
— ANI (@ANI) July 8, 2019