ఈరోజు సుప్రీం కోర్టు నుండి భారీ ఎదురుదెబ్బ చవిచూసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తతో ఊరటను ఇచ్చింది. కష్టకాలంలో ఏపీకి కేంద్రం జీఎస్టీ పరిహారం నిధులను విడుదల చేసింది. ఈ మధ్యనే మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన జీఎస్టీ విధానంతో పలు రాష్ట్రాలు గడ్దు పరిస్థితిని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇక ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక పరిస్థితి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.
చంద్రబాబు చేసిన అప్పుల వల్ల రాష్ట్రం ఇంకా వాటిలోని కొట్టుమిట్టాడుతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఇటువంటి రాష్ట్రాలకు విడతలవారీగా పరిహారం అందజేసిన విషయం తెలిసిందే. ఇక గత ఏడాది డిసెంబర్లో తొలిసారి జిఎస్టి పరిహారాన్ని అని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పుడు మరొకసారి కేంద్ర ఆర్థిక శాఖ జిఎస్టి పరిహారాన్ని అందిస్తోంది. జీఎస్టీ పరిహారం లో భాగంగా వెనుకబడిన రాష్ట్రాలకు భారీ స్థాయిలో మేలు చేకూరుతుంది.
ఇందులో భాగంగా రెండో దఫా పరిహారాన్ని ఈ రోజు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. కొన్నేళ్ళ క్రితం తీసుకువచ్చిన జీఎస్టీ విధానం వల్ల పలు రాష్ట్రాలు తీవ్రమైన నష్టాలను ఎదుర్కొంటారు. ఈ నేపథ్యంలో ఈ భర్తీకి కేంద్రం చర్యలు తీసుకుంది. తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ఆర్థిక శాఖ సోమవారం 3174.15 కోట్ల రూపాయలను విడుదల చేసింది.
స్పెషల్ బారోయింగ్ ప్లాన్ కింద ఆంధ్రప్రదేశ్ కు రూ.1810.71 కోట్లు విడుదల చేయగా తెలంగాణ రాష్ట్రానికి రూ 1336.44 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఇక ఎన్నో సార్లు ఏపీ సీఎం జగన్ కేంద్రంలోని పెద్దలను కలిసిన ప్రతిసారి జీఎస్టీ పరిహారం గురించి చేసిన విజ్ఞప్తులు ఆఖరికి ఫలితాన్నిచ్చాయి. ఇక దీంతో కేంద్రం ఏపీకి అదనపు నిధులు విడుదల చేసి ఊరటనిచ్చింది.