Chandrababu: వైసీపీలో కొందరు అసంతృప్తి ఎమ్మెల్యేలు ఇక్కడ టికెట్ దక్కకపోతే టీడీపీలోకి వెళితే కళ్లకద్దుకుని తీసుకుని టికెట్ ఇస్తారని భావిస్తున్నారు. అయితే వాళ్ల ఆశలపై నీళ్లు చల్లేలా టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తి వ్యాఖ్యలు చేశారు. వైసీపీలోని అసంతృప్తులు తమకెందుకు అని అన్నారు.
అక్కడ టికెట్ రాలేదని తమ వద్దకు వస్తామంటే తమకు అవసరం లేదని అన్నారు చంద్రబాబు. వైసీపీలో మంచి వాళ్లు ఉంటే పార్టీకి వస్తామంటే వాళ్ల అంశంపై ఆలోచన చేస్తామని తెలిపారు. గతంలో మాదిరిగా కాకుండా ఈ సారి త్వరగానే అభ్యర్ధులను ప్రకటిస్తామని అన్నారు చంద్రబాబు, పొత్తుల్లో ఉన్నామని, సీట్ల సర్దుబాటు చేసుకుంటున్నామని చెప్పారు. ఈ సారి అభ్యర్ధుల ఎంపిక విధానం వినూత్నంగా ఉంటుందని పేర్కొన్నారు.
ఇదే క్రమంలో జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు చంద్రబాబు. మద్యపాన నిషేదం చేయకుంటే ఓటు అడగను అని చెప్పిన జగన్ కు ఉప్పుడు ఓటు అడిగే హక్కు ఎక్కడిది అని ప్రశ్నించారు. పక్క రాష్ట్రాలకు బతుకుతెరువు కోసం వెళ్లిన వారు ఈ రాష్ట్రంలో ఓటు వేయొద్దని ఎలా చెబుతారని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పిస్తూ సవ్యంగా ఉంటే వాళ్లు వేరే రాష్ట్రాలకు ఎందుకు వెళతారని అన్నారు.
జగన్ చేసేవి అన్నీ చెత్త పనులేనని మండిపడ్డారు చంద్రబాబు. రుషికొండ మీద టూరిజం హోటల్ పేరుతో రూ.500 కోట్లతో భవనం కడతారా అని ప్రశ్నించారు. రుషికొండలో కట్టడాలు కట్టొద్దని చెప్పినా కొండను తవ్వేస్తారా అని నిలదీశారు. చట్టం సీఎంకు వర్తించదా అని అన్నారు. జగన్ లాంటి వాళ్లు రాజకీయాల్లో ఉండటానికి అర్హుడే కాదని అన్నారు. మూడు నెలల్లో జగన్ ఇంటికి వెళుతున్నారు.. తరలింపు సాధ్యమా.. ఎలా తరలిస్తారని ప్రశ్నించారు.
Parliament Security Breach: లోక్ సభలో 14 మంది విపక్ష సభ్యులపై సస్పెన్షన్ వేటు