2019 సార్వత్రిక ఎన్నికల్లో జగన్ కొట్టిన చావు దెబ్బ వల్ల అలా అయిపోయారా.. లేక కరోనా సమయంలో ఫుల్ రెస్ట్ వల్లా.. ఆదీగాక వయసురీత్యా వచ్చిన ఆలోచనా విధానమో తెలియదు కానీ… బాబు రోజు రోజుకీ దిగజారిపోతున్నారనే కామెంట్లు పెరిగిపోతున్నాయి. ఇంత సీనియర్ అయిన వ్యక్తి కూడా చిల్లర చిల్లరగా మాట్లాడటం, అధికారపక్షంపై బురద జల్లాలి అనే ఆలోచనలో భాగంగా.. తనను తాను మరింత చిల్లరిగా ప్రదర్శించుకోవడం చేస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి!
వివరాళ్లోకి వెళ్తే… గతకొన్ని రోజులుగా నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్న చందంగా తయారయ్యారు బాబు అనే కామెంట్లు బలంగా పడుతున్నాయి! తాజాగా జరిగిన రైతు దినోత్సవంలో బాబు పలికిన పలుకులే అందుకు నిదర్శనంగా చెబుతున్నారు ఏపీ వాసులు! 2014 ఎన్నికల ముందు రుణమాఫీ అంటూ హామీ ఇచ్చిన చంద్రబాబు.. తీరా కుర్చీ ఎక్కాక మోసం మొదలుపెట్టారు! అనేక మంది రైతులను అనర్హులుగా తేల్చారు. కుర్చీ ఎక్కాక కొత్త కండిషన్స్ పెట్టారు! ఫలితంగా రైతుల శాపం మూటగట్టుకున్నారు!
పైగా అధికారంపోయిన తర్వాత… గతంలో తామిచ్చిన హామీలను జగన్ నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. అవన్నీ ఒకెత్తు అయితే… రైతు దినోత్సవం రోజున బాబు నోట జాలువారిన మరో ఆణిముత్యం… ” ఈ సమయంలో తన చేతిలో అధికారం ఉండి ఉంటే.. రైతులకు తలా ఇరవై వేలు ఇచ్చేవాడిని” అని! ఇంతకు మించిన నిస్సిగ్గు వ్యాఖ్య మరొకటి ఉండదనేది వైకాపా నేతలు చెబుతున్న మాట!
అధికారంలో ఉన్నన్నాళ్లు రుణమాఫీ పేరు చెబితే ఫైరయ్యే బాబు.. జర్నలిస్టు మిత్రులు ప్రెస్ మీట్ లో ప్రశ్నలు అడిగితే వారిపై కూడా నిప్పులు చెరిగిన బాబు.. రైతు సమస్యలపై ప్రశ్నిస్తే వారందరినీ వైకాపా కార్యకర్తలుగా చిత్రీకరించిన బాబు… నేడు కరోనా సమయంలో జగన్ ఏ హామీని ఆపకుండా చేస్తూ, రైతులకూ వీలైనంత తోడుగా ఉంటుంటే… “ఇప్పుడు గనుక తానుంటేనా”… అంటూ “..నాకేటి సిగ్గు” అన్న మాటలు మాట్లాడుతున్నారని పలువురు రైతులు అభిప్రాయపడుతున్నారు!