Dhanush : కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ బాలీవుడ్, హాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తన సత్తా చాటుతున్నాడు. తమిళ పరిశ్రమలో సూర్య, కార్తి, విజయ్, అజిత్ లాంటి వారితో పోటీపడుతూ మంచి కమర్షియల్ హిట్స్ అందుకుంటున్నాడు. తమిళంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ సంపాదించుకున్న ధనుష్ హిందీ ఇండస్ట్రీలో కూడా క్రేజ్ సంపాదించుకున్నాడు. అలాగే హాలీవుడ్ నుంచి కూడా ధనుష్కి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఇదే క్రమంలో ఇటీవలే ఒక పాన్ ఇండియన్ సినిమాను ప్రకటించాడు ధనుష్. ఈ సినిమాను
తెలుగు, హిందీ, తమిళ భాషాలలో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. శేఖర్ కమ్ముల దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు.
నాగ చైతన్య – సాయి పల్లవి కాంబినేషన్లో తెరకెక్కిన లవ్ స్టోరి సినిమాతో నిర్మాణంలోకి అడుగుపెట్టిన ఏషియన్ డిస్ట్రిబ్యూటర్స్ నారాయణదాస్ నారంగ్, పి. రామమోహనరావు నిర్మించనున్నారు. దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమా నిర్మిస్తున్నారట. సాయి పల్లవి హీరోయిన్గా నటించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్స్ వర్క్ జరుగుతున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకి రానుంది. కాగా ఇంతలోనే మరో ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ ధనుష్తో ఒక పాన్ ఇండియన్ సినిమాను నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నట్టు తాజా అప్డేట్.
Dhanush : ధనుష్కి టాలీవుడ్లో మంచి క్రేజ్ వచ్చింది.
ఇప్పటికే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించబోతున్న ధనుష్ స్ట్రైట్ మూవీ కాగా మరొక స్ట్రైట్ మూవీ ఓకే చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. త్వరలో దీనికి సంబంధించిన అఫిషియల్ కన్ఫర్మేషన్ రానున్నట్టు తెలుస్తోంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ..పలుభారీ ప్రాజెక్ట్స్ నిర్మిస్తున్నారు. అందులో ఒకటి పవర్ స్టార్
పవన్ కళ్యాణ్ – రానా నటిస్తున్న ఏకే రీమేక్. ఇప్పుడు ధనుష్తో మరో పాన్ ఇండియా సినిమాకి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ధనుష్ నటించిన తమిళ సినిమాలన్నీ ఇక్కడ అనువాదం అయి తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. దాంతో ధనుష్కి టాలీవుడ్లో మంచి క్రేజ్ వచ్చింది. చూడాలి మరి స్ట్రైట్ సినిమాలతో ఇక్కడ ఏమేరకు సక్సెస్ అవుతాడో.