శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు జగన్ కేబినెట్లో స్థానం దొరికే సూచనలు స్పష్టంగా గోచరిస్తున్నాయి.అయితే అది ఇప్పుడా? లేకుంటే ఇంకో ఒకటిన్నర సంవత్సరం తరువాతా అన్నది మాత్రమే తేలాల్సి ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.2004 నుండి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రెవిన్యూతో సహా అనేక కీలక శాఖలు నిర్వహించిన ధర్మాన ప్రసాదరావుకు జగన్ తొలి మంత్రివర్గంలో స్థానం లభించలేదు.ఏ కారణం చేతనో ప్రసాదరావు అన్న కృష్ణదాస్కు జగన్ మంత్రి పదవి ఇచ్చారు.
ఇక క్రిష్ణదాస్ ని ఏరి కోరి జగన్ మంత్రిగా నియమించినా కూడా ఆయనలో దూకుడు లేదు, దాంతో శ్రీకాకుళంలో కేవలం రెండు సీట్లు మాత్రమే గెలుచుకున్న టీడీపీ రెచ్చిపోతోంది. ఇదే జిల్లా నుంచి మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఉన్నారు. ఆయన జగన్ మీద సవాల్ చేసే స్థాయికి రావడానికి జిల్లా మంత్రి రాజకీయం సరిగ్గా లేకపోవడమే కారణమని కూడా జగన్ వద్ద విశ్లేషణలు ఉన్నాయట. దానికి తోడు జిల్లా ఇంచార్జి మంత్రిగా వెళ్ళిన కొడాలి నాని సైతం ధర్మాన ప్రసాదరావే మంత్రిగా బెస్ట్ అంటూ జగన్ కి రిపోర్ట్ ఇచ్చారని నిజానికి ఇప్పటికిపుడు క్రిష్ణదాస్ ని తప్పించి ధర్మాన ప్రసాదరావుని మంత్రిని చేయరు కానీ రెండున్నరేళ్ల తరువాత జరిగే భారీ మార్పుల్లో జగన్ సమర్ధులకు పెద్ద పీట వేస్తారని అంటున్నారు. బహుశా అధి ఎన్నికల టీం కూడా అవుతుంది అని చెబుతున్నారు. అపుడు కచ్చితంగా ధర్మాన ప్రసాదరావుకు చాన్స్ ఇస్తారని చెబుతున్నారు. ఈ రకమైన సమాచారం ఉండడంతోనే ప్రసాదరావు అన్న, ప్రస్తుత మంత్రి క్రిష్ణదాస్ తమ్ముడు మంచి పాలనాదక్షుడు. ఆయనకు తొందరలోనే ఉన్నత పదవులు వస్తాయని మీడియాముఖంగానే చెప్పడం కూడా ఇక్కడ గమనార్హం.దాంతో ఇపుడు మాజీ మంత్రి క్యాంప్ ఫుల్ హ్యాపీగా ఉందని అంటున్నారు.మొత్తం మీద మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తితో ఉన్న ధర్మాన ప్రసాదరావుకు మంచి శకునాలే కనిపిస్తున్నాయి.