Sudheer and Rashmi: సుధీర్, రష్మీ జోడి బుల్లితెర పైన ఓ సెన్షేషన్. అంతలా జనాల్లోకి వారు దూసుకు పోయారు. దానికి కారణం ఏకైక షో.. దాని పేరే జబర్ దస్త్. ఈ షో ద్వారా వీరు ఎంతలా ఫేమస్ అయ్యారంటే, ప్రేక్షకులు వాళ్ళని పెళ్లి చేసుకునేంత. అంతలా వాళ్ళు ఆ షో ద్వారా ఆడియన్స్ మనసులను కొల్లగొట్టారు. ఇక దానితో పాటుగా డాన్స్ షో అయినటువంటి ఢీ లో కూడా వీరిద్దరూ కలిసి ఆడియెన్స్ను అలరించిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు ఢీ నుంచి సుధీర్, రష్మీ గౌతమ్ బయటకు వచ్చేశారంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి.
కారణం ఏమై ఉంటుంది?
రీసెంట్గానే ఢీ-13 షో సక్సెస్ ఫుల్ గా ముగిసింది. ఇప్పుడు తరువాత మొదలవ్వబోయే ఢీ-14 డాన్స్ షో మీదే అందరి కళ్ళు పడ్డాయి. ఈ క్రమంలో తాజాగా ఢీ-14 ప్రోమోను నిర్వాహకులు విడుదల చేశారు. ఇందులో టీమ్ లీడర్స్ గా సుధీర్, రష్మీ గౌతమ్ స్థానంలో బిగ్ బాస్ సీజన్-4 కంటెస్టెంట్ అయినటువంటి అఖిల్ మెరిశారు. దాంతో అందరికీ రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. తరువాత రష్మీ ప్లేసులో రష్మీనే వుంటుందా లేక వేరొకరు రాబోతున్నారా? అనే అనుమానం ప్రేక్షకుల మదిలో మెదిలింది.
అసలు కారణం ఇదేనంట!
రెమ్యునరేషన్(డబ్బులు) విషయంలో వీరు రాజీ పడలేదని, చర్చలు జరిగిన తర్వాత కూడా వీరు మాట వినలేదని, అందువలన నిర్వాహకులు వారు అడిగినంత డబ్బులు ఇవ్వలేక పక్కన పెట్టేశారనేది కొందరి వాదన. ఓ పక్క సుధీర్ రష్మీ జంట లేని ఢీ-14 సీజన్ ను చూడలేమని తన అభిమానులు నెట్టింట రచ్చ రంబోలా చేయడం మనం గమనించవచ్చు. ఇక ఆడియన్స్ కోరిక మేరకు నిర్వాహకులు తమ మనసు మార్చుకుంటారా లేక రష్మీ సుధీర్ల జంట పెద్ద మనసు చేసుకొని షోలో పాల్గొంటారా లేదనేది కాలమే నిర్ణయించాలి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!