AP Election 2024: సార్వత్రక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఏపీలో పలువురు ఉన్నతాధికారులపై బదిలీ వేటు పడింది. ఎన్నికల సంఘం (ఈసీ) ముగ్గురు ఐఏఎస్ లతో పాటు ఆరుగురు ఐపీఎస్ లను బదిలీ చేసింది. ఎన్నికల ప్రక్రియలో నిర్లక్ష్యంతో పాటు అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న అభియోగాలను పురస్కరించుకుని వీరిపై వేటు వేసినట్లు సమాచారం. అటు ప్రధాని సభలో భద్రతా వైఫల్యాలకు సంబంధించి కూడా వేటు వేస్తూ ఆదేశాలిచ్చింది.
ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, చిత్తూరు ఎస్పీ పి. జాషువా, అనంతపురం ఎస్పీ కేకే అన్బురాజన్, నెల్లూరు ఎస్పీ కె. తిరుమలేశ్వర్పై బదిలీ వేటు వేసింది. అలానే సీనియర్ ఐపీఎస్ అధికారి, గుంటూరు రేంజ్ ఐజీ జి. పాలరాజును కూడా బదిలీ చేసింది. ఓటర్ల జాబితాలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వ్యవహారంతో పాటు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన ఫిర్యాదులపై జిల్లా ఎన్నికల అధికారులుగా ఉన్న మూడు జిల్లాల కలెక్టర్లపై వేటు పడింది. కృష్ణా జిల్లా కలెక్టర్ పి. రాజబాబు, అనంతపురం జిల్లా కలెక్టర్ ఎం. గౌతమి, తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీషాలపై బదిలీ వేటు వేశారు.
ఈ మేరకు ఎన్నికల సంఘం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోట్ ను పంపింది. వేటు పడిన అధికారులంతా తమ బాధ్యతల్ని దిగువ స్థాయి అధికారులకు అప్పగించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. మరో వైపు బదిలీ అయిన జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీల నియామకానికి ముగ్గురు చొప్పున పేర్లను కమిషన్కు పంపాల్సిందిగా ఆదేశాల్లో పేర్కొన్నారు.
Janasena: జనసేనకు బిగ్ షాక్ ఇచ్చిన ఈసీ .. ఫ్రీ సింబల్ జాబితాలో గాజు గ్లాస్