Janasena: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు మే 13న ఒకే విడతలో జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీలో ఓడించాలన్న లక్ష్యంలో టీడీపీ, బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకుంది. పొత్తులో భాగంగా రెండు లోక్ సభ, 21 అసెంబ్లీ స్థానాల్లో జనసేన పోటీ చేస్తున్నది. ఇక కూటమి అభ్యర్ధుల విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారాన్ని కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రారంభించారు.
ఈ తరుణంలో జనసేన పార్టీకి ఎన్నికల సంఘం (ఈసీ) షాక్ ఇచ్చింది. ఎన్నికల నేపథ్యంలో గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలు, గుర్తింపు లేని పార్టీల జాబితాను ఇవేళ ఈసీ విడుదల చేసింది. ఈ జాబితాలో ఏపీ నుండి గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీల్లో వైసీపీ, టీడీపీ ఉన్నాయి. ఈ క్రమంలో వైసీపీకి ఫ్యాన్ గుర్తు, టీడీపీకి సైకిల్ గుర్తును ఈసీ కేటాయించింది. ఎన్నికల కమిషన్ జనసేన పార్టీని కేవలం రిజిస్టర్ పార్టీగానే గుర్తించింది.
ఈ క్రమంలో జనసేనకు ఫ్రీ సింబల్ గా గాజు గ్లాస్ గుర్తును కేటాయించింది. ఈ మేరకు తాజాగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో అప్రమత్తమైన జనసేన పార్టీ న్యాయనిపుణులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తొంది. జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గ్లాస్ ఒక వేళ ఫ్రీ సింబల్ లో ఉంటే .. స్వతంత్ర అభ్యర్ధులుగా పోటీ చేసే వారికి కూడా ..ఎంపిక ద్వారా గ్లాస్ గుర్తు కేటాయించే అవకాశం ఉంటుంది. ఇలా జరిగితే .. కూటమి అభ్యర్ధులపై ఆ ప్రభావం పడి నష్టం జరుగుతుంది.
Breaking: బీజాపూర్ లో భారీ ఎన్ కౌంటర్ ..ఎనిమిది మంది మావోలు మృతి