పశ్చిమ గోదావరి జిల్లా.. ముఖ్య పట్టణమైన ఏలూరు కు ఏదో అయింది… వరుసగా చిన్నపిల్లలు వృద్ధులు పిట్టల్లా రాలిపోతున్న పడిపోవడం ఇప్పుడు కలకలం రేపుతోంది… మూర్చ వచ్చినట్లు కొట్టుకుంటూ కొట్టుకుంటూ మరి పడిపోతున్న నివ్వెరపరుస్తోంది. ఒకరు కాదు ఇద్దరు కాదు వరుసగా పదుల్లో ఇలా అస్వస్థతకు గురై పడిపోతున్న వైనంపై అధికారులు ఆందోళన నెలకొంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం గా ఉన్న ఏలూరు లో ఏం జరిగిందో తెలుసుకునేందుకు ఉన్నతాధికారులు దృష్టి పెట్టారు.
ఉన్నట్టుండి మోక్షం రావడం వెనువెంటనే, నోటి వెంట నురగలు పడుకుంటూ పడిపోవడం ఏలూరులో కలకలం రేపుతోంది. ఇలా రెండు రోజులుగా జరుగుతున్న అధికారులు చాలా తేలిగ్గా తీసుకున్నారు. ముఖ్యంగా ఏలూరు వన్ టౌన్ ప్రాంతం లో పదుల సంఖ్యలో చిన్నారులు గత రెండు రోజులుగా మూర్ఛతో పడిపోతున్న అధికారుల్లో చలనం లేదు. సాధారణంగానే చిన్నారులు నిలబడి పోతున్నారని చాలా లైట్ తీసుకున్నారు. ఆస్పత్రికి వెళ్లిన వారికి ఇలాంటి రకమైన సమాధానం లభించింది. గత రెండు రోజులుగా ఇదే జరుగుతున్న శనివారం మాత్రం ఈ సంఖ్య గణనీయంగా పెరిగింది. వన్ టౌన్ ప్రాంతంలో చిన్నారులు ఎక్కువ శాతం పది సంవత్సరాల లోపు చిన్నారులు ఫీట్స్ తో పడిపోవడం ఎక్కువైంది. సుమారు 100మంది వరకు ఇదే రకమైన లక్షణాలతో ఆస్పత్రి పాలైతే గాని అధికారుల్లో చలనం లేకపోయింది. అప్పటికప్పుడు అప్పటికీ అప్పుడు వైద్యశిబిరం తోపాటు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నియోజకవర్గ ఎమ్మెల్యే ఆళ్లనాని సైతం దృష్టిసారించారు.
ఏమైంది??
ఇప్పటివరకు చిన్న పిల్లల యొక్క ఆసుపత్రులకు గల కారణాలను ప్రభుత్వ అధికారులు కనుగొనలేకపోయారు. రకరకాల పుకార్లు వ్యాపిస్తున్నాయి. వన్ టౌన్ ప్రాంతంలో ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వల్ల, నీళ్లలో కలిసిన కలుషితం వల్ల అంటూ రకరకాల పుకార్లు వ్యాపించాయి. అర్ధరాత్రి దాటి కొలది మరింత ప్రచారాన్ని అందుకుంటున్నాయి. దీంతో ఏలూరు ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మంచినీళ్లు తాగాలా లేక మరేమైనా సమస్య అనేది అంతుబట్టడం లేదు. దీనిపై సాక్షాత్తూ ముఖ్యమంత్రి దృష్టి పెట్టినా సరే ఇప్పటివరకు దాని యొక్క జడ కోలుక్కోలేకపోయారు. సమస్య ఎక్కడుందో అర్థం కాకపోవడంతో బాధితుల సంఖ్య మరింత పెరగవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే సుమారు 130 మంది వరకు వివిధ ఆస్పత్రులలో చేరారు. 10 సంవత్సరాల లోపు చిన్నారులకు ఈ సమస్య ఎక్కువగా ఉంది. దీంతో ఏలూరు అల్లకల్లోలం అవుతుంది