హైదరాబాద్ : నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికను వాయిదా వేయాలని 16 మంది రైతులు దాఖలు చేసిన పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది.
పిటిషనర్ల తరఫున న్యాయవాది రచనా రెడ్డి కోర్టుకు వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా నామినేషన్ పత్రాలను కోర్టుకు సమర్పించాలని పిటిషనర్కు హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నామినేషన్ పత్రాలు ఉంటేనే విచారణ జరుపుతామని కోర్టు స్పష్టం చేసింది. దాంతో నామినేషన్ పత్రాలు సకాలంలో అందలేదని పిటిషనర్ తరపు న్యాయవాది రచనా రెడ్డి కోర్టుకు తెలిపారు.
నామినేషన్ పత్రాల సమర్పణకు సోమవారం వరకు గడువు ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. అంతేకాక ఎన్నికల నిబంధన ప్రకారం ప్రతి స్వతంత్ర అభ్యర్థికి గుర్తును కేటాయించాలని రచనా రెడ్డి కోర్టుకు తెలిపారు. ఈ మేరకు తదుపరి విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది.
నిజామాబాద్ ఎంపి ఎన్నికపై రైతులు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. గుర్తులు ఎలా ఉంటాయో చెప్పలేదనీ, వాటిపై ప్రచారం చేసుకోడానికి తగినంత సమయం లేనందున ఎన్నికను వాయిదా వేయాలని కోరుతూ లంచ్మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికను వాయిదా వేసి, ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్ పద్ధతి ద్వారా రెండో విడతలో ఎన్నికలు నిర్వహించేలా కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై హైకోర్టు విచారణ జరుపుతున్నది.