Flipkart sale: ప్రముఖ ఇండియన్ ఈ కామర్స్ దిగ్గజం అయినటువంటి ఫ్లిప్కార్ట్ తన కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. రూ.75వేల విలువైన టీవీని కేవలం రూ.25లకే ఆఫర్ చేస్తోంది. ఈ ఫ్రిబ్రవరి 3నుంచి 5వరకు బిగ్ బచత్ ధమాల్ పేరుతో సేల్ నిర్వహిస్తున్న సంగతి తెలిసినదే కదా. ఇక ఈ సేల్లో పలు టీవీలపై అదిరిపోయే ఆఫర్లు అందిస్తున్నట్లు తాజాగా తెలిపింది. ఈ సేల్ లో ‘వీయూ’ కంపెనీకి చెందిన 55 అంగుళాల స్మార్ టీవీ ఇప్పుడు కేవలం రూ.25 వేలకే కస్టమర్లకు లభిస్తోంది. అయితే షరతులు వర్తిస్తాయి సుమా..
Flipkart sale: ఏమిటా షరతులు:
55 అంగుళాల పరిధి కలిగిన ఈ స్మార్ట్, అల్ట్రా హెచ్డీ, ఎల్ఈడీ, స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ ఖరీదు రూ.75 వేలు. ప్రస్తుతం ఈ సేల్ లో 49శాతం డిస్కౌంట్ను కలిగివుంది. దాంతో ఈ టీవీ ధర రూ.37,999కి కుదించబడింది. ఇక యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగిస్తే అదనంగా 5% క్యాష్ బ్యాక్, వలన మరో రూ.1,900 తగ్గుతుంది. అలాగే హెచ్డీ ఎల్ఈడీ టీవీని ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద జత చేస్తే రూ.11,000 వరకు ఆదా చేసుకోవచ్చు. తద్వారా కొనుగోలు దారులు ఈ స్మార్ట్ ఈ టీవీని రూ.36,099 నుంచి రూ.25,099కే సొంతం చేసుకోవచ్చు.
Singer Sunitha: భర్త రామ్ ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన ఓ నెటిజన్.. చెంప పగిలేలా కౌంటర్ ఇచ్చిన సింగర్ సునీత!
వీయూ స్మార్ట్ టీవీ ఫీచర్లు ఓసారి చూడండి..
– డిస్ ప్లే: ఆల్ట్రా హెచ్ డీ, ఎల్ఈడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ
– రిజల్యూషన్: 3,840 x 2,160 పిక్సెల్స్
– అప్ గ్రేడ్ రేట్: 60 hz
– సౌండ్ స్పీకర్స్: 30 డబ్ల్యూ సౌండ్ అవుట్పుట్తో రెండు స్పీకర్లు.
– వీటితో పాటు ఈ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీలో అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, యూట్యూబ్, డిస్నీ + హాట్ స్టార్ ఓటీటీలు అందుబాటులో ఉన్నాయి.