Paytm: ప్రముఖ UPI పేమెంట్ సంస్థలలో మొదటిదైనటువంటి Paytm కస్టమర్లను దృష్టిలో పెట్టుకొని ఎన్నో ఆఫర్లను తాజాగా అందిస్తోంది. 1 రూపాయి నుండి 100000 వరకు వేగంగా బదిలీ చేసే అవకాశం ఉండటంతో Paytm యాప్ వినియోగం రోజురోజుకీ పెరుగుతుంది. ఈ క్రమంలో తాజాగా Paytm బంపర్ ఆఫర్ను ప్రకటించింది. 4 కా 100 క్యాష్బ్యాక్ పేరుతో అదిరిపోయే ఆఫర్ను Paytm అందుబాటులోకి తెచ్చింది. అంటే ఇక్కడ Paytm యూజర్లు కేవలం 4 రూపాయలను బదిలీ చేస్తే ఏకంగా 100 వరకు గెలుచుకోవచ్చు.
Corns: ఆనెలు త్వరగా తగ్గడానికి ఈ సింపుల్ చిట్కా..!
Paytm: ఆఫర్ ఎప్పటినుండి ఎప్పటివరకు?
ఇక్కడ ట్విస్ట్ ఏమంటే, Paytm కొత్త యూజర్లకు మాత్రమే ఈ ఛాన్స్ వుంది. పాతవారికి కాదు. ఇండియా వర్సెస్ వెస్ట్ ఇండిస్ వన్డే, టీ20 సిరీస్ జరిగే సమయంలో నగదు బదిలీ చేయడం ద్వారా సులువుగా 100 రూపాయలు గెలుచుకోవచ్చు అని సమాచారం. యూజర్ల సంఖ్యను మరింత పెంచుకోవాలనే ఆలోచనతో Paytm ఈ ఎత్తుగడ వేసినట్టుగా తెలుస్తోంది. కాగా ఫిబ్రవరి 6వ తేదీ నుంచి ఫిబ్రవరి 20వ తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని Paytm యాజమాన్యం చెబుతోంది.
Trivikram: అందుకే ‘భీమ్లా నాయక్’ సినిమాకు అన్నీ తానైయ్యాడు..రివీల్ చేసిన నిర్మాత
రిఫరల్ కోడ్?
Paytm రిఫరల్ ప్రోగ్రామ్ పేరుతో కస్టమర్లకు అదనపు క్యాష్ బ్యాక్ ను కూడా అందిస్తుండటం ఇక్కడ విశేషం. ఈ ఆఫర్ లో భాగంగా రిఫరల్ కోడ్ ను పంపితే 100 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ ను పొందే వీలుంది. కొత్తవారు ఈ Paytm ఆఫర్ను వినియోగించుకుంటే ఎంతో లాభపడవచ్చు. ఇక ఈ Paytm ఆఫర్లను తెలుసుకున్న మార్కెట్ నిపుణులు త్వరలో గూగుల్ పే, ఫోన్ పేలకు ధీటుగా ఈ సంస్థ ఎదగబోతోందని చెబుతున్నారు.