మౌనమేలనోయి`, `నిను చూడక నేనుండలేను`, `ఒరేయ్ పండు`, `ఆజాన్`, `జాక్పాట్`, `వీరప్పన్`, `వీడెవడు`, `నెక్ట్స్ ఏంటీ`, `అమావాస్` చిత్రాల్లో నటించిన సచిన్ జోషిని గుట్కా అక్రమ రవాణా కేసులో హైదరాబాద్ పోలీసులు ఆరెస్ట్ చేశారు.ఈ వార్త టాలీవుడ్ ,బాలీవుడ్ లో సంచలనం రేపింది.
సచిన్ జోషి మొదటినుంచి వివాదాస్పదుడే. సచిన్ జోషి ,ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ లకు మధ్య పెద్ద గొడవ కావడమే కాకుండా అది ఇంకా కోర్టుల్లో నలుగుతోంది. జోషిని హీరోగా పెట్టి బండ్ల గణేష్ నిర్మించిన సచిన్ ఫైనాన్స్ చేశారట.ఆ సినిమా విడుదల అట్టర్ఫ్లాప్ కావడంతో వీరి మధ్య ఆర్థిక పరమైన వివాదాలు తలెత్తాయి. ఒకరినొకరు మీడియాలో తీవ్రంగా దూషించుకున్నారు.పరస్పరం కేసులు పెట్టుకున్నారు.అవిప్పుడు నడుస్తున్నాయి.ఇప్పుడు సచిన్ జోషి గుట్కా అక్రమ రవాణా కేసులో అరెస్టు కావటం అనేది టాలీవుడ్ ని కుదిపేసింది.బాలీవుడ్లో అత్యంత సంపన్నమైన కుటుంబానికి చెందిన నటుల్లో సచిన్ జోషి ఒకరు. ఆయన తండ్రి గుట్కా వ్యాపారంలో ప్రసిద్ధి. గుట్కా కింగ్గా ఆయనకు పేరు. ఓ వైపు ముంబై, మరోవైపు హైదరాబాద్లో అక్రమంగాఈ వ్యాపారం సాగిస్తున్నారన్న టాక్ ఉంది.
ఇటీవల హైదరాబాద్ పోలీసులకు భారీగా గుట్కా రవాణా అవుతున్న బాక్సులు లభించాయి.కోట్లాది రూపాయల విలువ చేసే సరుకు పట్టుబడింది.వేరే ప్రాంతాల నుండి ఈ గుట్కా బాక్సులు హైదరాబాద్ వస్తున్నట్టు తీరింది దీనిపై వారు లోతుగా దర్యాప్తు చేయగా సచిన్ జోషి పేరు బయటకొచ్చింది.ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచి పోలీసులు సచిన్ జోషిని పట్టుకోవడానికి ప్రయత్నించగా మంగళవారం రాత్రి ఆయన ముంబై నివాసంలో హైదరాబాద్ పోలీసులకు దొరికిపోయాడు.సచిన్పై ఐపీసీ 273, 336 సెక్షన్ల ప్రకారం నిషేధిత మత్తు పదార్థాల కేసు నమోదైంది.ఇప్పటికే టాలీవుడ్ బాలీవుడ్ లను డ్రగ్స్ కేసులు వణికిస్తున్నాయి. తాజాగా గుట్కా రవాణా కేసులో సచిన్ జోషి దొరికపోవడంతో టాలీవుడ్ బాలీవుడ్ షేక్ అవుతున్నాయి.ఇంకా ఈ విహారంలో ఎవరైనా సినీ ప్రముఖుల ఉన్నారా అనేది విచారణలో తేలుతుంది.