హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గం నుంచి గెలిచిన కేసిఆర్ ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారని పిటిషన్ దాఖలైంది. గజ్వేల్కు చెందిన శ్రీనివాస్ అనే ఓటరు కేసిఆర్పై పిటిషన్ను దాఖలు చేశారు.
కేసిఆర్పై 64 క్రిమినల్ కేసులు ఉంటే మొదటి అఫిడవిట్లో కేవలం నాలుగు కేసులు మాత్రమే చూపారని పిటిషన్లో పేర్కొన్నారు. తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసిన కేసిఆర్ను ఎమ్మెల్యేగా అనర్హుడుగా ప్రకటించాలని పిటిషనర్ కోరారు.
పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. కేసిఆర్కు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.