TS Government: ఓ అద్భుతాన్ని ఆవిష్కరించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.అయితే ఇది జరిగే పనేనా అన్న అనుమానాలు లేకపోలేదు.కరోనారోగులనుండి కార్పొరేట్ ఆస్పత్రిలో ముక్కుపిండి వసూలు చేసిన అధిక మొత్తాలు మొత్తాన్ని రికవరీ చేస్తామని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు చేసిన ప్రకటన ఇప్పుడు సంచలనం రేపుతోంది.
నేపథ్యం ఏమిటంటే ?
కరోనా రోగులకు చికిత్స విషయంలో కార్పొరేట్ ఆస్పత్రులు అవలంభించిన వైఖరిని తెలంగాణ హైకోర్టు తప్పుబట్టింది.వారి మెడపై కత్తి పెట్టి మరీ తీసుకుని కార్పొరేట్ ఆస్పత్రులు దండుకున్నాయని వ్యాఖ్యానించింది.ఈ విషయంలో కార్పోరేట్ ఆసుపత్రుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.అలాగని కేవలం ఆస్పత్రుల అనుమతులు రద్దు చేసి చేతులు దులుపుకోకు౦డా అవి వసూలు చేసిన అధిక ఫీజులను ముక్కు పిండి సదరు ఆసుపత్రుల నుండి వసూలు చేయాల్సిందేనంటూ హైకోర్టు తేల్చి చెప్పింది. దీంతో అనివార్య పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. కోర్టు ఆదేశాలను తప్పనిసరిగా పాటిస్తామంటూ శ్రీనివాసరావు గురువారం మీడియా ముందుకొచ్చారు
శ్రీనివాసరావు చెప్పిన వివరాలు!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 114 ప్రైవేటు ఆస్పత్రుల మీద ఇవాళ్టి వరకు 185 ఫిర్యాదులు వచ్చాయని,అత్యధికంగా హైదరాబాద్ లో 72 ఫిర్యాదులు, మేడ్చల్ లో 49 ఫిర్యాదులు అందాయన్నారు.పలు జిల్లాల నుండి కూడా ఈ తరహా ఫిర్యాదులు వచ్చాయని ఆయన వివరించారు.ఫిర్యాదు రాగానే తాము స్పందించి సదరు ఆస్పత్రులకు నోటీసులు ఇవ్వగా వారు ఇచ్చిన సమాధానాలు సంతృప్తికరంగా లేకపోవడంతో ఇరవై రెండు ఆసుపత్రుల్లో కోవిడ్ చికిత్సను రద్దు చేశామన్నారు.కరువును ఆర్థిక శాఖకు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన రేట్లను మాత్రమే ఏ ఆసుపత్రయినా వసూలు చేయాలని అందుకు భిన్నంగా జరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు.తాజాగా కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఏ ఆస్పత్రి అయితే రోగులనుండి రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన రేట్ల కంటే ఎక్కువగా డబ్బు వసూలు చేసిందో దాన్ని రికవరీ చేస్తామని ఆయన తెలిపారు.ఆ మొత్తాలను సదరు రోగులకి తిరిగి ఇస్తామని కూడా శ్రీనివాసరావు ప్రకటించారు.ఇది నిజంగానే చాలా మంచి చర్య .అయితే ఎంత వరకు ఆచరణలో సాధ్యపడుతుందన్నదే చూడాలి.తెలంగాణలో కనుక ఇది ఇది జయప్రదమైతే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇలాంటి చర్యలే తీసుకోవాల్సి ఉంటుంది.ఆంధ్రప్రదేశ్ లోని పలు హాస్పిటళ్ల మీద కూడా ఈ తరహా ఫిర్యాదులు లేకపోలేదు.చూద్దాం ఏం జరుగుతుందో?