Shakeela: మహమ్మారి కరోనా వైరస్ కారణంగా సినిమా ఇండస్ట్రీకి చెందిన అనేకమంది నటీనటులు సహాయ కార్యక్రమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది వలస కార్మికులకి సాయం అందిస్తూ అప్పటినుండి దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేస్తున్న సోనూసూద్… ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా.. ఆక్సిజన్ కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కరోనా రోగులకు సాయం చేస్తూ వస్తున్నారు. అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి ఇంకా కేజిఎఫ్ హీరో యాష్… మంచు మనోజ్, పూజా హెగ్డే మరికొంత మంది స్టార్లు సేవలందిస్తూ ఉండగా తాజాగా ఇదే జాబితాలో కి షకీలా కూడా చేరింది.
శృంగార తరహా సినిమాల్లో సౌత్ ఇండస్ట్రీ లోనే టాప్ ఇమేజ్ సంపాదించిన షకీలా.. ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తూ ఉంది. ఫామ్లో లేకపోయినా గాని పేద వాళ్ళని ఆదుకోవడంలో తాను ముందు ఉన్నాను అన్నట్టు తాజాగా సోషల్ మీడియాలో సాయం చేయాలని.. నెటిజన్లను కోరుతూ పోస్ట్ పెట్టింది. ఎవరికివారు తమ చుట్టుప్రక్కల ఉన్న పేద ప్రజలను ఆదుకోవాలని ఒక చేయి సాయం చేయడానికి అందించాలని పేదలను పోషించాలని షకీలా పిలుపునిచ్చింది.
ఈ క్రమంలో తాను తన చుట్టుపక్కల ఉన్న పెద్దలకు మరియు సామాన్య ప్రజలకు.. సాయం చేస్తున్నట్లు స్పష్టం చేసింది. చాలా వరకు షకీలా పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమాలు చేస్తూ మరోపక్క కొన్ని కటిక పేద కుటుంబాలకు… దినసరి సరుకులు నల్ల ఒకసారి పడేవి పంచుతూ.. తనలో సేవా గుణాన్ని చాటుతూ వస్తుందట. ఇటీవలే తమిళ రాజకీయాలలో షకీలా ఎంట్రీ ఇవ్వడం తెలిసిందే. మార్చి నెలలో తమిళనాడు కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆమె.. ఆ పార్టీ తరఫున తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో భారీ ఎత్తున ప్రచారం లో పాల్గొన్నారు. అయితే అక్కడ డీఎంకే పార్టీ గెలవడంతో ప్రస్తుతం షకీలా ఈ దిశగా తన వంతు గా కరోనా నేపథ్యంలో పేద కుటుంబాలను ఆదుకుంటూ ఇతరులను కూడా ఆదుకోవాలని సాయం కోరుతోంది.