Chiranjeevi Oxygen Banks: చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్స్ Chiranjeevi Oxygen Banks ప్రస్తుత కరోనా సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి జిల్లాలో (తెలంగాణలో ఉమ్మడి జిల్లా ‘చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్స్’ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.) ఎటువంటి చారిటీ ఆశించకుండా సొంతంగా 30కోట్లకు పైగానే ఖర్చుతో ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేశారని తెలుస్తోంది. చిరంజీవి ప్రకటించిన వారంలోపై జిల్లాల్లో ఆక్సిజన్ సిలిండర్లను అందుబాటులోకి తీసుకురావడం విశేషం. అయితే.. మీడియా నుంచి చిరంజీవి చేస్తున్న సాయానికి సహకారం అందలేదు. నిన్న ఆంధ్రప్రభలో మాత్రం కవర్ పేజీ వార్తతోపాటు వివరంగా చిరంజీవి చారిటీ గురించి పెద్ద ఆర్టికల్ వేశారు. దీంతో సంస్థ చైర్మన్ మాజీ మంత్రి.. ముత్తా గోపాలకృష్ణతో చిరంజీవి ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రస్తుత మీడియా పోకడపై వారి వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.
గోపాలకృష్ణ మాట్లాడుతూ.. ‘కోట్లాది చిరంజీవి అభిమానులు ఆవేదనను తాను గమనించి ఇలా అక్షర రూపంలోకి మార్చానని చెప్పారు. ఇంతటి బృహత్తర కార్యక్రమంపై ఒక ఎమ్మెల్యే, ఎంపీ కనీసంగా కూడా ప్రస్తావించకపోవడం తనను బాధించిందని చెప్పుకొచ్చారు. ప్రజల నుంచి దోచుకున్న డబ్బులతో కొద్దిపాటి కార్యక్రమాలు చేస్తున్న కొందరికి కూడా ఎంతో ప్రచారం వస్తుంటే మీలాంటివారు సొంత కష్టార్జితంతో ఇంత మంచి ప్రయత్నాన్ని చేస్తున్నా విమర్శలు ఎదుర్కోవలసి వస్తోందని చిరంజీవితో అన్నారు. దీనికి చిరంజీవి స్పందిస్తూ.. ‘ప్రస్తుతం మీడియా ఇలా ఉండడం మన ఖర్మ’ అన్నారు. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్లకు ఉండొచ్చని.. మంచి పని చేసినప్పుడు మంచి అని చెప్పకపోగా చెడుగా చిత్రీకరిస్తూ వార్తలు చేయడం బాధించిందని చిరంజీవి అన్నారు.
Read More:Chiranjeevi Oxygen Banks: తెలుగు మీడియాకు చిరంజీవి సాయం కనిపించదా..? సోనూ మాత్రమేనా..?
చిరంజీవి చేస్తున్న సాయానికి మెగా అభిమానులు రెండు రాష్ట్రాల్లోనూ ఈ కార్యక్రమాన్ని తమ భుజాలపై వేసుకున్నారు. గుంటూరు నుంచి 60 కిమీ దూరంలో ఉన్న పిడుగురాళ్లకు కూడా వెళ్లి సిలిండర్ ఉచితంగా ఇచ్చారు. కర్ణాటకలో చిరంజీవి ప్లాంట్ పెట్టకపోయినా.. ఆయన స్ఫూర్తిగా చింతామణిలో మహేశ్ అనే అభిమాని స్వచ్చంధంగా ప్లాంట్ ఏర్పాటు చేశాడు. వారికి కూడా చిరంజీవి సిలిండర్లు పంపించారు. ఇలాంటి కార్యక్రమం మీడియాలో ప్రచారమైతే అవసరమైన వారికి సమాచారం అందుతుంది.. ప్రాణాలు కాపాడటంలో భాగమవుతుంది. దురదృష్టం కొద్దీ ప్రజలకు వార్తను చెప్పాల్సిన మీడియా చిన్నచూపు చూడటం బాధాకరం. మెగా అభిమానులు సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారమే చిరంజీవికి అండగా నిలిచిందని చెప్పాలి.